మాది అనంతపురంజిల్లా అమరాపురం మండలంలోని కెంకెరా గ్రామం. ఆ రోజు రాజీవ్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్గారు మా గ్రామానికి వచ్చారు. ఆ సందర్భంగా నేను దాదాపు బ్రిటిష్వారి హయాంలోని ఒక సమస్యను ఆయనకు విన్నవించాను. వెంటనే అప్పటి కలెక్టర్ అనురాధకి గ్రామస్తుల సమక్షంలోనే ఉత్తర్వులిచ్చి ‘ఒక్క నెలరోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను. నన్ను నమ్మండి. మీ ఊరి రూపురేఖలను మారుస్తాను’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదుగురు సర్వేయర్లు, ఆర్డీఓ, ఎమ్మార్వో సుమారు 250 ఎకరాల బంజరుభూమిని సర్వే చేయించి, సాగుదార్లందరికీ పట్టాలిచ్చిన భూమిదాత వైఎస్సార్. కర్ణాటకలో బీసీలుగా ఉండే మమ్మల్ని బీసీల నుండి ఓసీలుగా చేసిన బ్రహ్మానందరెడ్డిగారి ఉత్తర్వులను రద్దుచేసి, మళ్లీ బీసీలుగా జీవో ఇచ్చిన వైఎస్సార్ మాకు దేవుని కంటే ఎక్కువ.
ఈ పని ప్రధాని దేవెగౌడ గాని, మా కులం మంత్రిగాని చేయలేదు. వైఎస్సార్ వచ్చిన తర్వాత మా గ్రామంలోని అన్ని సమస్యలూ తీరాయి. ప్రజలారా! ఆ మహానుభావునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన బిడ్డను ఈ రాష్ట్రానికి రాజును చేసి, ఆయన భార్య కన్నీళ్లను తుడిచి, వాళ్ల కుటుంబంలో సంతోషం నింపడం తప్ప. ఈ రాష్ట్రంలో అన్ని కుటుంబాలను చింత నుండి దూరంచేసిన వైఎస్సార్ కుటుంబం సంతోషంగా ఉండవద్దా? ఆలోచించండి. ఆ మహానేత తనయుడైన జగన్గారిపై బురద జల్లి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధిస్తుంటే చూస్తూ ఊరుకునేంత అమాయకులు కారు ప్రజలు. సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పి తీరతారు. ఆ రోజును మనమంతా తప్పక చూస్తాం.
- కె.జయప్రకాష్, అమరాపురం, అనంతపురం జిల్లా
e-mail: ysjagankosam@gmail.com
0 comments:
Post a Comment