పాదయాత్ర చరిత్రలో అరుదైన ఘట్టం:రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్ర చరిత్రలో అరుదైన ఘట్టం:రోజా

పాదయాత్ర చరిత్రలో అరుదైన ఘట్టం:రోజా

Written By news on Thursday, May 16, 2013 | 5/16/2013


వైఎస్ షర్మిల పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా అభివర్ణించారు. ఒక మహిళ మండుటెండలో పాదయాత్ర చేయటం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని ఆమె తెలిపారు. షర్మిలను వైఎస్ఆర్ ఆశీస్సులు, వైఎస్ జగన్ ఆశయాలే నడిపిస్తున్నాయని రోజా గురువారమిక్కడ అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.



గుంటూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2000 కి.మీలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా పార్టీ నేతల్లో, కార్యకర్తల్లోఉత్సాహం నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి.. రాజన్న రాజ్య స్థాపన కోసం చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలో మీటర్లు పూర్తవుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 
Share this article :

0 comments: