రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతిరోజూ ఈ చేరిక కొనసాగుతూనే ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో వైఎస్ఆర్సీపీ నేతలు జంపన్నప్రతాప్, వెంకట్రావ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. సికింద్రాబాద్ వైఎస్ఆర్సీపీ నేత ఆదం విజయ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కూకట్ పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నుంచి 200 మంది పార్టీలో చేరారు.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం గాంధీనగర్ లో ఆ పార్టీ నాయకురాలు షర్మిల సమక్షంలో 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు జన్నారెడ్డి మహేందర్ రెడ్డి, కర్ణావతు రాధా వెంకన్ననాయక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఖమ్మం జిల్లా భద్రాచల నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావ్ సమక్షంలో మెల్లిమి హర్షవర్దన్ సహా 400 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగర్పల్లిలో గిద్దలూరు సమన్వయకర్త ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి 500 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. |
Home »
» భారీగా వైఎస్ఆర్ సిపిలో చేరిక
భారీగా వైఎస్ఆర్ సిపిలో చేరిక
Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment