అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నేతలను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సిద్ధార్ధరెడ్డి, కాంతారెడ్డిలు కొద్ది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకుని నిమ్స్ ఆస్పత్రికెళ్లి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. దాంతోపాటు నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో రోగుల ఆరోగ్య పరిస్థితిని వైఎస్ విజయమ్మ అడిగి తెలుసుకున్నారు.
Home »
» నిమ్స్ లో ఇద్దరు నేతలకు విజయమ్మ పరామర్శ!
నిమ్స్ లో ఇద్దరు నేతలకు విజయమ్మ పరామర్శ!
Written By news on Friday, May 24, 2013 | 5/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment