హైదరాబాద్: వైఎస్ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్ను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యం అన్నారు. పార్టీపై తమకు అసంతృప్తిలేదని చెప్పారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. తాము పార్టీ మారడంలేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు.
జగన్తో రాజకీయాల గురించి చర్చించినట్లు తెలిపారు. తమకున్న కొద్దిపాటి సమస్యలకు సంబంధించి జగన్ తగిన సలహాలు ఇచ్చారని చెప్పారు. విజయమ్మ, షర్మిలమ్మ వెంట నడిచి పార్టీని ముందుకు తీసుకువెళతామన్నారు. ప్రజలు కూడా తప్పుగా అనుకోవద్దని కోరారు. తాము ఎప్పుడూ వైఎస్ కుటుంబంతోనే ఉంటామని చెప్పారు. వారితోపాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జగన్ను కలిశారు |
Home »
» వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం:కొండా సురేఖ
వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం:కొండా సురేఖ
Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment