నీరు బంద్,అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీరు బంద్,అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్..

నీరు బంద్,అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్..

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

కిరణ్, చంద్రబాబు లపై దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల శుక్రవారం నిప్పులు చెరిగారు. కిరణ్ సర్కారుతో ప్రతిపక్షనేత చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఉండి చేరిన ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు పలికి ఐఎంజీ,ఎమ్మార్ కేసుల విచారణ లేకుండా చంద్రబాబు అమ్ముడుపోయారని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం అమలు చేస్తే, ఆయనకు వెన్నుపోటుపోడిచి అడ్డదారులు తొక్కి సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. బాబు హయాంలో మళ్లీ బెల్ట్ షాపులు తెరిపించారన్నారు. చంద్రబాబు నాయకుడా లేక ఊసరవెల్లా ఆని షర్మిల ప్రశ్నించారు. 

ఎరువుల ధరలు కిరణ్ ప్రభుత్వమే పెంచిందని తెలిపారు. కిరణ్ సర్కారు కారణంగా వ్యవసాయానికి నీరు బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్ అని అన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక వడ్డీలేని రుణం అందిస్తామని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే వైఎస్ ఆర్ అమ్మ ఒడి పథకాలతో ఆదుకుంటారన్నారు. 70 లక్షల మంది ప్రజలను పిచ్చోళ్లు చేసి చిరంజీవి కాంగ్రెస్ లో చేరారని షర్మిల ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: