27న కొవ్వొత్తుల ప్రదర్శన.. 28న నిరసన దీక్ష
- అనుమతి ఇవ్వాలని డీజీపీకి వైఎస్సార్సీపీ వినతి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుట్రలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన, ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షకు అనుమతివ్వాలని డీజీపీ వి.దినేష్రెడ్డికి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు బి.జనక్ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి, మతిన్, ఆదం విజయకుమార్, లింగాల హరిగౌడ్ డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ ఎస్ఏ హుడాకు కూడా విజ్ఞప్తి చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో కుమ్మక్కై జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారని ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆరోపించారు. జగన్ను అక్రమంగా నిర్బంధించి ఏడాది అవుతున్నందున 10 వేల మందితో ఈనెల 27న నెక్లెస్రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన, 28న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో శాంతియుత నిరసన ర్యాలీ, ఇందిరాపార్కు వద్ద జరిగే నిరసన దీక్షకు పోలీసుశాఖ నుంచి అనుమతి లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. తమ విజ్ఞప్తికి డీజీపీ దినేష్రెడ్డి సానుకూలంగా స్పందించారని పార్టీ నేతలు తెలిపారు
- అనుమతి ఇవ్వాలని డీజీపీకి వైఎస్సార్సీపీ వినతి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుట్రలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన, ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షకు అనుమతివ్వాలని డీజీపీ వి.దినేష్రెడ్డికి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు బి.జనక్ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి, మతిన్, ఆదం విజయకుమార్, లింగాల హరిగౌడ్ డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ ఎస్ఏ హుడాకు కూడా విజ్ఞప్తి చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో కుమ్మక్కై జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారని ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆరోపించారు. జగన్ను అక్రమంగా నిర్బంధించి ఏడాది అవుతున్నందున 10 వేల మందితో ఈనెల 27న నెక్లెస్రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన, 28న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో శాంతియుత నిరసన ర్యాలీ, ఇందిరాపార్కు వద్ద జరిగే నిరసన దీక్షకు పోలీసుశాఖ నుంచి అనుమతి లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. తమ విజ్ఞప్తికి డీజీపీ దినేష్రెడ్డి సానుకూలంగా స్పందించారని పార్టీ నేతలు తెలిపారు
0 comments:
Post a Comment