రేపు బాపట్లలో మహిళా నగారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు బాపట్లలో మహిళా నగారా

రేపు బాపట్లలో మహిళా నగారా

Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013

గుంటూరు: మహిళల ఆర్థిక భద్రత, ఆత్మగౌరవమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5న గుంటూరు జిల్లా బాపట్లలో మహిళా సదస్సు నిర్వహించనున్నారు. దీనికి మహిళా నగారాగా పార్టీ నేతలు నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజమయ్మ ముఖ్యఅతిథిగా హజరుకానున్నారు. సదస్సు నిర్వహణకు నేతలు భారీఏర్పాట్లు చేస్తున్నారు. 240 అడుగుల భారీ సభా వేదికను నిర్మిస్తున్నారు. సభా ప్రాంగణానికి తెనాలిలో ఇటీవల మరణించిన బేతాళ సునీల పేరును ఖరారు చేశారు. సదస్సు విజయవంతానికి సమావేశాలు నిర్వహించి శ్రేణుల్ని ఉత్తేజ పరుస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, తానేటి వనితతో పాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, ఆర్‌కే రోజా, వాసిరెడ్డి పద్మ, నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు హాజరు కానున్నారు. బాపట్ల నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కోన రఘుపతి నేతృత్వంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించారు. 
Share this article :

0 comments: