ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ప్రజలకు భరోసా ఇచ్చేవారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారు. అలా ధైర్యంగా నిలబడిన నాయకులు వైఎస్సార్, ఆయన తనయుడు జగన్. తండ్రి ఆశయ సాధన కోసం పోరాడుతున్న జగన్కు ఓటమన్నది ఉండదన్న భయంతో ఆంధ్రరాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కు అయి జగన్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని పన్నుతున్న కుతంత్రాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఓటువేసే అవకాశం వచ్చినా ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. రాజన్న పాలనకోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
అధికార, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఎన్ని ఇబ్బందులు పెట్టినా జనం జగనన్న వెంట ఉంటారని ఇప్పటికే గత ఉప ఎన్నికల్లో రూఢీ అయింది. ప్రజలు ఓదార్పుయాత్రను చూశారు. మరో ప్రజాప్రస్థానాన్నీ చూస్తున్నారు. నాయకులంటే ప్రజల కష్టాలు తీర్చడానికి ఉండాలి తప్ప ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి కాదు అని నిరూపించిన వ్యక్తి వైఎస్సార్ మాత్రమే. అందుకనే రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఆయనను పెద్దాయన అంటారు. ఆ పెద్దాయన లక్షణాలు జగనన్నలో ఉన్నాయి కాబట్టే తమ పీఠాలెక్కడ కదిలిపోతాయోనని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ స్వార్థ నాయకులు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా జగనన్న జైలు నుంచి రావడం, రాజన్న రాజ్యం స్థాపించడం ఖాయం. - షేక్ అమీర్ జానీ, పొన్నూరు, గుంటూరు జిల్లా |
Home »
» జగన్ తప్ప, ఒక్కరైనా ఉన్నారా...ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు?
జగన్ తప్ప, ఒక్కరైనా ఉన్నారా...ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు?
Written By news on Friday, May 31, 2013 | 5/31/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment