ప్రధాని మన్మోహన్‌కు వైఎస్ విజయమ్మ లేఖ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధాని మన్మోహన్‌కు వైఎస్ విజయమ్మ లేఖ!

ప్రధాని మన్మోహన్‌కు వైఎస్ విజయమ్మ లేఖ!

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

 సౌదీ అరేబియా అమలుపరచనున్న కొత్త కార్మిక చట్టంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే 12లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడతారని లేఖలో విజయమ్మ తెలిపారు. లక్ష మంది తెలుగువారు రోడ్డునపడతారని.. ఈ విషయంపై సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చించాలని ప్రధానికి విజయమ్మ సూచించారు. 

భారతీయులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్ కు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చట్టం అమలు చేసేముందు భారతీయులకు మరింత గడువు ఇచ్చేలా చూడాలని లేఖలో తెలిపారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: