నేటి నుంచి షర్మిల యాత్ర పునఃప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి షర్మిల యాత్ర పునఃప్రారంభం

నేటి నుంచి షర్మిల యాత్ర పునఃప్రారంభం

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పునఃప్రారంభమవుతుంది. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్ తరఫున చేపట్టిన పాదయాత్ర.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో సాగుతుండగా బూడిదంపాడు వద్ద ఆమె ఎడమ కాలు మడమ బెణికి గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ముచ్చర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న షర్మిల బుధవారం పాదయాత్ర పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. మంగళవారంఅపోలో ఆసుపత్రి వైద్యుడు సీఎస్ రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని, గాయం 95 శాతం నయమైందని, మెల్లగా నడక ప్రారంభించవచ్చని సూచించారని చెప్పారు. 
Share this article :

0 comments: