మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది అని వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం... కరెంట్ కోతలతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని తెలుసుకోవడం లేదని షర్మిల విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనలో చంద్రబాబు, కిరణ్ ఇద్దరు దొందూ దొందే అని షర్మిల అన్నారు.
9 గంటల విద్యుత్ ఇస్తామన్న వైఎస్ హామీని కిరణ్ గాలికొదిలేశారని..విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహం తప్ప మరో ద్యాసలేదని, ఆయనకు మాటపై నిలబడటం చేతకాదని అన్నారు. హైదరాబాద్లో చార్మినార్, నాగార్జునసాగర్ను కూడా తానే కట్టించానని అంటారేమోనని షర్మిల ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు నీతి న్యాయం లేదని, మూడో పార్టీ ఉండకూడదని కుట్రపన్ని జగనన్నను జైలుకు పంపించారని షర్మిల అన్నారు. తణుకు సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి షర్మిల నివాళుల్పించారు.
9 గంటల విద్యుత్ ఇస్తామన్న వైఎస్ హామీని కిరణ్ గాలికొదిలేశారని..విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహం తప్ప మరో ద్యాసలేదని, ఆయనకు మాటపై నిలబడటం చేతకాదని అన్నారు. హైదరాబాద్లో చార్మినార్, నాగార్జునసాగర్ను కూడా తానే కట్టించానని అంటారేమోనని షర్మిల ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు నీతి న్యాయం లేదని, మూడో పార్టీ ఉండకూడదని కుట్రపన్ని జగనన్నను జైలుకు పంపించారని షర్మిల అన్నారు. తణుకు సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి షర్మిల నివాళుల్పించారు.
0 comments:
Post a Comment