వైఎస్ విజయమ్మ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో స్వల్పమార్పు చోటుచేసుకుంది. ఈ నెల 20న జరగాల్సిన కార్యక్రమం అనివార్యకారణాల దృష్ట్యా 21కి వాయిదా పడిందని వైఎస్ఆర్సీపీ నేత జనక్ప్రసాద్ తెలిపారు. ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్ అని చెప్పారు. వెంటనే ప్రాజెక్టు పూర్తిచేస్తే తెలంగాణలో ఉన్న 7 జిల్లాల ప్రజలకు లబ్ధిచేకూరుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వైఎస్ఆర్ మానసపుత్రిక అని గుర్తు చేశారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాలన్నారు.
Home »
» వైఎస్ విజయమ్మ పర్యటనలో మార్పు
వైఎస్ విజయమ్మ పర్యటనలో మార్పు
Written By news on Thursday, May 16, 2013 | 5/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment