బాబువి పనికిరాని పాదయాత్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబువి పనికిరాని పాదయాత్రలు

బాబువి పనికిరాని పాదయాత్రలు

Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013

- టీడీపీ నేత మణిగాంధీ విమర్శ.. వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల తన పాలనా కాలంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదని, ప్రజలు ఆయనకు పట్టంగట్టే పరిస్థితి లేదని కర్నూలు జిల్లా కోడుమూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శిఖామణి తనయుడు, టీడీపీ నాయకుడు మణిగాంధీ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు.

గాంధీ వెంట పత్తికొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, నాయకుడు భూపాల్‌రెడ్డి ఉన్నారు. ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన గాంధీ విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోతలు, రెట్టింపు చార్జీలతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. వైఎస్సార్ సీపీని కాంగ్రెస్‌లో కలిపితే జగన్‌ను బయటకు తీసుకువస్తామన్న కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆ పార్టీ క్రమ శిక్షణ ఎటువంటిదో ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. 

Share this article :

0 comments: