హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏపీపీఎస్సీ నియామకాల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచాలని వైఎస్ఆర్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు డిమాండ్ చేశారు. లెక్చరర్ల నియామకాల్లోనూ డీఎస్సీ నియామకాల వయోపరిమితినే పాటించాలని బాలినేని సూచించారు. యూపీ, కేరళ, బెంగాల్లో అన్ని నియామకాల్లో వయోపరిమితి 40 ఏళ్లుగా ఉందని..యూపీపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు.
ఏపీపీఎస్సీ వెలువరించే పలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని..జాప్యం వల్ల విద్యావంతులైన యువతీయువకులు అవకాశాలు కోల్పోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఏపీపీఎస్సీ వెలువరించే పలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని..జాప్యం వల్ల విద్యావంతులైన యువతీయువకులు అవకాశాలు కోల్పోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment