ఖమ్మం జిల్లా ఏన్కూరులో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అని షర్మిల అన్నారు. తొమ్మిదేళ్ల హయాంలో 8సార్లు చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారని షర్మిల విమర్శించారు. బాబుకు పదవి మీద ఆశ లేదంటే భూమి గుండ్రంగా లేదన్నట్టే అని షర్మిల వ్యాఖ్యానించారు.
రంగులు మార్చడం బాబు రక్తంలోనే ఉందని, విలువలు, విశ్వసనీయత బాబు డిక్షనరీలోనే లేవని షర్మిల అన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు నిజం చెప్పకూడదనే శాపం ఉన్నట్టుందన్నారు. కాంగ్రెస్కానీ సీబీఐని కానీ బాబు ఎందుకు ప్రశ్నించడంలేదని షర్మిల నిలదీశారు. |
Home »
» బాబుకు నిజం చెప్పకూడదనే శాపం
బాబుకు నిజం చెప్పకూడదనే శాపం
Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment