ఆ మంత్రులను తప్పిస్తే సర్కారుకు మద్దతిస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ మంత్రులను తప్పిస్తే సర్కారుకు మద్దతిస్తారా?

ఆ మంత్రులను తప్పిస్తే సర్కారుకు మద్దతిస్తారా?

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలనే డిమాండ్‌తో ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి హైడ్రామాలను ఎవరూ నమ్మరని టీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతానని చెప్పడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారా అని కడియం ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రభుత్వంతో ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కైందని ప్రజలు అనుకుంటారని చంద్రబాబు చెప్పినట్లు కడియం వెల్లడించారు. తెలంగాణ, సీమాంధ్రలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని, ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేయొద్దని కడియం సూచించారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటే ఆవిషయమై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ నేతలు ఎందుకు అడగలేదని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. కేవలం కళంకిత మంత్రులను కాదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: