బిందెడు మంచినీళ్లు ఇవ్వడంలేదు: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిందెడు మంచినీళ్లు ఇవ్వడంలేదు: వాసిరెడ్డి పద్మ

బిందెడు మంచినీళ్లు ఇవ్వడంలేదు: వాసిరెడ్డి పద్మ

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013

మహిళలకు ఒక్క బిందె మంచి నీళ్లు అందివ్వడం చేతకాని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రకటించిన బంగారుతల్లి పథకానికి కొనసాగింపుగా ‘బూచోళ్లం వస్తున్నాం’ అని చేరిస్తే కిరణ్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అతికినట్లు సరిపోయేదని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకడంలేదు. మంచి నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు. అలాంటి వ్యక్తులు మహిళలకు మంచిచేస్తామంటే నమ్మెదెవరు? ఎన్నికల సమయం దగ్గరకొస్తోందని మహిళలను మచ్చిక చేసుకోవడానికి వారు ఆడుతున్న గిమ్మిక్కులు’’ అని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: