రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించిన తీరు వివాదాస్పదంగానే ఉంది.సిబిఐలో అత్యున్నత పదవిలో ఉన్న ఈయన బొగ్గు కుంభకోణంలో తయారుచేసిన నివేదికను న్యాయశాఖ మంత్రి చూసి మార్పులు చేశారని చెప్పి సంచలనం సృష్టించారు. తాజాగా కేసు దర్యాప్తులో ఉండగానే బన్సల్ కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.దీనిని ఆయా విపక్షాలు తప్పుపడుతున్నాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు.రంజిత్ సిన్హా ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఈ ప్రకటన చేసినట్లు ఉందని ఆయన అన్నారు.కేసును నీరుకార్చే విదంగా సిన్హా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు.సిబిఐ తీరు ఇలా ఉంటుందన్నమాట.
http://kommineni.info/articles/dailyarticles/content_20130517_15.php
http://kommineni.info/articles/dailyarticles/content_20130517_15.php
0 comments:
Post a Comment