కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రాబందుల్లా పీక్కుతింటోందని షర్మిల విమర్శించారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా ఉప్పలచర్ల షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతుల వెన్నంటి నడిచిన నేత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీలతో రైతులను వైఎస్ఆర్ ఆదుకున్నారని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిగ్రామంలో మహిళా పోలీసులను నియమిస్తామని హామీయిచ్చారు. అక్రమ మద్యం, బెల్ట్షాపులను నిర్మూలిస్తామన్నారు. అతి త్వరలో జగనన్న నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుందని షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment