తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. తాను ఎన్.టి.ఆర్., చంద్రబాబు నాయుడుల ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశానని, ఏ రకమైన అవకతవకలకు, దందాలకు అవకాశం లేకుండా పనిచేశానని అన్నారు. టిడిపి తనను ప్రోత్సహించింది, గుర్తింపు ఇచ్చిందని ఆయన అన్నారు.అయితే ప్రస్తుతం పార్టీలో పారిశ్రామికవేత్తలకు, డబ్బున్నవారికి,ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన విమర్శించారు.రెండు సాదారణ ఎన్నికలలోను,ఆ తర్వాత ఉప ఎన్నికలలో టిడిపి ఓడిపోయిందని ఆయన అన్నారు.చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలం అని ఎన్నడూ చెప్పలేదని శ్రీహరి అన్నారు. ఎఫ్.డి.ఐల విషయంలో పార్టీ విప్ ను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోలేదని అన్నారు.అవిశ్వాస తీర్మానం విషయంలో టిడిపి తటస్థంగా ఉండడం సరికాదని అన్నారు.కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని కూడా శ్రీహరి వ్యాఖ్యానించారు.
Home »
» టిడిపిని పారిశ్రామికవేత్లలు నడుపుతున్నారు
టిడిపిని పారిశ్రామికవేత్లలు నడుపుతున్నారు
Written By news on Saturday, May 11, 2013 | 5/11/2013
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. తాను ఎన్.టి.ఆర్., చంద్రబాబు నాయుడుల ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశానని, ఏ రకమైన అవకతవకలకు, దందాలకు అవకాశం లేకుండా పనిచేశానని అన్నారు. టిడిపి తనను ప్రోత్సహించింది, గుర్తింపు ఇచ్చిందని ఆయన అన్నారు.అయితే ప్రస్తుతం పార్టీలో పారిశ్రామికవేత్తలకు, డబ్బున్నవారికి,ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన విమర్శించారు.రెండు సాదారణ ఎన్నికలలోను,ఆ తర్వాత ఉప ఎన్నికలలో టిడిపి ఓడిపోయిందని ఆయన అన్నారు.చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలం అని ఎన్నడూ చెప్పలేదని శ్రీహరి అన్నారు. ఎఫ్.డి.ఐల విషయంలో పార్టీ విప్ ను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోలేదని అన్నారు.అవిశ్వాస తీర్మానం విషయంలో టిడిపి తటస్థంగా ఉండడం సరికాదని అన్నారు.కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని కూడా శ్రీహరి వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment