బాబు పచ్చి అవకాశవాది.
బాబు 1978 లో కాంగ్రెస్ MLA గా మొదటిసారి గెలిచాడు , కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చింది.
1982 లో ఎన్టీఆర్ పార్టీ పెడుతున్న రా అల్లుడు అని కబురు పంపితే తిరస్కరించాడు, మంత్రి పదవి లో ఉన్న కాంగ్రెస్ ను వదలలేక.
పైగా ముకానికి రంగులేసుకోనేవాడికి, తైతక్కలాదెవల్లకి ఎవరు వోట్లేస్తారు?
ఎన్టీఆర్ పరమ పిసినారి, ఎన్నికలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, పార్టీ ని నడపలేదు అని చెప్పాడు.
కాంగ్రెస్ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీదే పోటీచేసి ఓడిస్తానంటూ బీరాలు పలికాడు.
సరే తర్వాత , 1983 లో ఎన్టీఆర్ తీదీపి పార్టీ మంచి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.
వెంటనే అంటే పట్టుమని 10 రోజులు కూడా లేకుండా తీదీపి లో చేరాడు బాబు.
పోనీ అక్కడన్నా పద్దతిగా ఉన్నాడా అంటే లేదు తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటుచేసుకోని ఎన్టీఆర్ ను రామోజీ సహాయముతో వెన్నుపోటు పొడిచి CM అయ్యాడు, ఎన్టీఆర్ బ్యాంకులో దాచుకొన్న 70 లక్షల రూపాయల కాష్ కూడా తీసేసుకొని ఎన్టీఆర్ ను మానసికంగా హింసించి అయన మరణానికి కారణమయ్యాడు. అసహ్య్హకరమైన విషయమేమిటంటే బాబు తన MLA లచే ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించాడు వైస్రాయ్ హోటల్ దగ్గర.నందమూరి వంశం అని మీసాలు మెలేసి తొడలు కొట్టే పుత్రులు ఏమి చేసారు మరి అని మాత్రం అడక్కండి.
తర్వాత ఇండియా టుడే కిచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ లో నైతిక విలువలు లేవి అన్నాడు , తను అధికారం లో ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఫోటో కూడా ఉండటానికి లేదు అని పార్టీ కి ఆదేశించాడు.
బాబు CM గా ఉన్నప్పుడు తీదీపి మద్దతు మెడ ఆధారపడ్డ NDA కేంద్రములో అధికారం లో ఉంది అప్పుడు స్పీకర్ గా తీదీపి కి చెందిన బాలయోగి ఎన్టీఆర్ విగ్రహము పార్లమెంటులో పెట్టమని అనుమతి ఇచ్చాడు కానీ బాబు పట్టించుకోలేదు.
2004 ఎన్నికలలో ఓడిపోయాక బాబు బొమ్మకు వోట్లు పడవని గ్రహించి ఎన్టీఆర్ ఆదర్శ పురుషుడు, యుగపురుషుడు , కారణ జన్ముడు అని , NTR విగ్రహము పార్లమెంటు లో పెట్టాలి అని, భారత రత్న ఇవ్వాలి అని మొసలి కన్నీరు కార్చాడు .ఎందుకు?
బాబు CM గా ఉన్నప్పుడు మేనరిక వివాహాలు చేసుకోకూడదు, పిల్లలు పుడితే జబ్బులతో పుడతరి అని చెప్పాడు.డాక్టర్ లు కూడా ఇదే చెబుతారు.
మరి 2004 ఓడిపోయాక బాబు తనకోడుక్కి బాలయ్య కూతుర్ని ఇచ్చి మేనరిక వివాహం చేసాడు కదా ఎందుకు? ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొంటే నాలుగు వోట్లు వస్తాయని.
బాబు CM గా ఉన్నప్పుడు ఉపఎన్నికలు జరిగితే ఒక్కో ఉప ఎన్నిక జరిగే నియోజక వర్గానికి సుమారు 80 మంది MLA లను పంపేవాడు ప్రచారానికి.
ఎన్నికలు జరిగే నియోజక వర్గములో ఏ కులస్తులు ఎక్కడ ఉన్నారో చూసి ఆ కులపు MLA లను అక్కడికి పంపి వాళ్ళ వోట్లు సంపాదించేవాడు, ఆ విధంగా కులాల కుంపటి రగిల్చేవాడు.
ఒకసారి సిపిఐ నారాయణ చెప్పాడు బాబు గురించి.సిపిఐ నారాయణ తిరుపతి లో SFI లీడర్ గా ఉన్నప్పుడు బాబు SV యూనివర్సిటీ లో కమ్మ స్టూడెంట్స్ కి లీడర్ గా ఉండే వాడు అని.
1995 లో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న బాబు మొట్టమొదటిసారిగా 1999 ఎన్నికలలో తన ఆద్వర్యములో యుద్దానికి వెళ్ళాల్సి వచ్చింది.బాబు మీద వ్యతిరేకత ఉంది అని సర్వే లు చెప్పాయి.
అప్పుడు కార్గిల్ వార్ పుణ్యము, వాజపాయి గారి చరిస్మా బాగా ఉండడముతో దేశమంతా BJP గాలి వీస్తోంది.
అప్పటిదాకా ఎన్టీఆర్ వెన్నుపోటు లో సహకరించిన కమ్యూనిస్టులను కాదని , BJP ని విమర్శించిన నోటితోనే వారిని పొగిడి రాత్రికి రాత్రి BJP తో పొత్తు పెట్టుకొని గెలిచాడు (ఈనాడు అంచనా ప్రకారము BJP కి 18 శాతము వోట్లు ఉనాయి అప్పుడు)
అప్పుడు బాబు వాడుకొని వదిలేసే స్వభావము బాగా అర్ధము చేసుకొన్న కేంద్ర కమ్యూనిస్టుల ఆదేశం మేరకు 'బాబు జమానా అవినీతి ఖజానా' అనే పుస్తకము వ్రాసారు మన సిపిఎం రాగావులు గారు.
ఆ తర్వాత బాబు NDA హయాములో చక్రము తిప్పాడు కానీ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కానీ పరిశ్రమ కానీ తేలేదు, మరి చక్రము తిప్పి ఏమి చేసాడు అని మీకు సందేహము రావచ్చు.ఏముంది తన పనులు చక్కపెట్టుకొని, తన అను 'కుల' వారిని న్యాయమూర్తులుగా నియమించుకొన్నాడు, డబ్బు ను విదేశాలలో దాచుకొన్నాడు, అందుకే ఇప్పటికీ రహస్య విదేశీయానాలు చేస్తుంటాడు.
సరే, BJP తో 1999 లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో గెలిచిన బాబు 2004 లో కూడా పొత్తు పెట్టుకొని ఓడిపోయాడు ,ఓడిపోగానే BJP ని మతతత్వ పార్టీ అని తెగతెంపులు చేసుకొన్నాడు.
పోనీ 1999 లో తెలీదు అనుకొన్నా 2004 లో BJP మతత్వ పార్టీ అని తెలీదా? మరి పొత్తు ఎందుకు పెట్టుకొన్నాడు?
ఓడిపోగానే నెపం అంతా BJP మీద వేసాడు. పచ్చి అవకాసవాది బాబు.
చంద్ర బాబు మనస్తత్వం -2
బాబు CM గా ఉన్నప్పుడు నేను రోజూ ఉదయం రెండు ఇడ్లీ తింటాను, మధ్యాహ్నము రెండు పుల్కాలు, రాత్రిళ్ళు కొన్ని పళ్ళు ,మజ్జిగ తాగుతాను, అంత సింపుల్ జీవితము నాది అని తానో రుషి అన్న లెవెల్ లో కలర్ ఇచ్చేవాడు.
కానీ వాస్తవమేమిటంటే అతను షుగర్ వ్యాది, బొల్లి అనే చర్మ వ్యాధులతో బాధ పడుతున్నాడు.
సహజంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు తినమని చెప్పే ఆహారమే బాబు తిన్నాడు కానీ తనకు షుగర్ ఉందని దాచిపెట్టి తానో రుషి పుంగవున్ని అన్న లెవెల్ లో తన మితాహరపు అలవాట్లు గురించి చెప్పుకోనేవాడు.
ఆమధ్య బాబు రైతు దీక్ష చేస్తానని ప్రకటించగానే టీడీపి MLC రాజేంద్ర ప్రసాద్ దీక్ష కు రెండు రోజుల ముందు టీవీ 9 వారధి ప్రోగ్రాం కు వచ్చాడు, నేను చూసాను.
మా బాబు గారికి షుగర్ వ్యాధి ఉంది కాబట్టి 2 రోజులకంటే ఆహారము లేకుండా ఉండలేదు కాబట్టి బాబు దీక్ష కు కూర్చోగానే ప్రభుత్వము స్పందించి అయన డిమాండ్స్ నెరవేర్చి దీక్ష విరామింపజేయాలి అని చెప్పాడు.
ఎవరికైనా అనుమానముంటే టీవీ 9 ను సంప్రదించండి.
సరే అన్నట్టుగానే బాబు రెండు రోజుల తర్వాత దీక్ష కు కూర్చున్నాడు.దీక్ష ప్రారంభమైన రెండు రోజులకి బాబు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయి 71 కి వచ్చింది, బాబు ను తర్వాత నిమ్స్ కు తరలించారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి, జగన్ కు బద్ద వ్యతిరేకి అయిన DL.Ravindra Reddy నిమ్స్ కు వెళ్లి పరామర్శించాడు (బాబు కి నిమ్స్ లో అన్నీ సమకూర్చాడు అని అప్పట్లో గుగుసగుసలు విన్పించాయి అంటే కెసిఆర్ కు నిమ్స్ లో ఇచ్చినట్టుగా ద్రవ పదార్ధాలు ఇచ్చారు అని టాక్.బాబు అప్పటికే కాంగ్రెస్ తో రహస్య ఒప్పందము చేసుకొని ఉన్నాడు. జగన్ దీక్ష చేసినప్పుడు కానీ ఈ మధ్య విజయమ్మ దీక్ష చేసినప్పుడు కానీ మంత్రులు ఎవరూ వెళ్ళలేదు కానీ బాబు దీక్ష చేస్తే వెళ్లి వచ్చారు.ఇంతకంటే మ్యాచ్ ఫిక్సింగ్ కు సాక్ష్యము అవసరమా?)
సరే , ఆ గుసగుసలు నిజమే సుమా అన్నట్టుగా బాబు 8 వ రోజు అనుకుంట దీక్ష విరమించాడు , దీక్ష విరమించిన రోజున బాబు షుగర్ లెవెల్ 91 ఉంది. ఇది ఈనాడు పేపర్ వ్రాసింది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు 2 రోజులు దీక్ష చేయడమే గొప్ప ఎందుకంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి అటువంటిది 8 రోజుల తర్వాత బాబు షుగర్ లెవెల్స్ ఆరోగ్యవంతుని కంటే బాగా ఉంది.
మరి ఈ విచిత్రము ఏంటి అని అంతా అనుకొన్నారు.
సరే, సాక్షి ఈ విషయమై చర్చ పెట్టింది. షుగర్ వ్యాధి తో బాధ పడుతున్న బాబు కి రెండవ రోజు షుగర్ లెవెల్ 71 ఉంది నిమ్స్ లో చేరిన తర్వాత 8 వ రోజు షుగర్ రీడింగ్ 91 ఎలా సాధ్యము?
అక్కడ ఎమన్నా బాబు కు ద్రవ ఆహారము ఇచ్చి ఉండకపోతే ఎలా సాధ్యము అని.
సాక్షి టీవీ లో డెక్కన్ క్రానికల్ సీనియర్ ఎడిటర్ MV Krishna Rao గారు, ఒకరిద్దరు విలేఖరులు , డాక్టర్లు కూర్చున్నారు చర్చకు.
డాక్టర్లు అంతా 8 రోజుల నిరాహార దీక్ష తర్వాత షుగర్ రీడింగ్ పెరగడము అనేది వైద్య శాస్త్రములో వింత, తినకపోతే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కానీ పెరగవు కాబట్టి బాబు కు రహస్యంగా ఏదో ఒక రూపములో ఆహారము ఇచ్చి ఉంటారు అన్నారు.
DC న్యూస్ చీఫ్ కృష్ణ రావు గారు తానూ 30 సం గా షుగర్ వ్యాదిగ్రస్తున్ని అని ఒక మనిషి ఆహారం తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి కానీ పెరగవు అని బాబు దీక్ష లో ఆహారము తీసుకోలేదంటే నమసక్యంగా లేదు అని చెప్పారు .
ఈ సాక్షి ప్రోగ్రాం చూస్తున్న తీదీపి వాళ్ళు బాబు ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతుంది అని కడియం శ్రీహరి చేత ప్రెస్ మీట్ పెట్టించి సాక్షి ని తిట్టించారు బాబు కు షుగర్ వ్యాధి లేదు అయిన సాక్షి అబద్దాలు ప్రసారం చేస్తోంది అని.
తర్వాత ఢిల్లీ నుంచి బాబు దీక్ష ను అభినందించడానికి వచ్చిన సిపిఐ నాయకుడు AB Bardhan , బాబు కు ఎప్పటినుంచో షుగర్ ఉంది, ఢిల్లీ కి వచ్చినప్పుడు మా ఇంట్లో భోజనము చేస్తాడు అందువలన నాకు తెలుసు అని చెప్పాడు.
బాబు కు షుగర్ వ్యాధి ఉండడము తప్పు కాదు కానీ దాన్ని దాచిపెట్టి దీక్ష లో ఆహారము తీసుకొని ఇన్ని అబద్దాలు ఆడడము అవసరమా?
ఇకపోతే బాబు CM గా ఉన్నప్పుడు నేను రోజూ 18 గంటలు కష్టపడుతున్నాను అనేవాడు.
నిజంగా ఒక మనిషికి ఇది సాధ్యమా?
ఎవరైనా ఒకటి రెండు రోజులు 18 గంటలు పనిచేయచ్చు కానీ రోజూ అలా చేయగలమా?
కనీసము 7 గంటల నిద్ర, 2 గంటలు స్నానము, భోజనాలకు, 2 గంటలు కుటుంబ సభ్యులకు పోగా మిగిలేది రోజులో 13 గంటలే కదా, మరి బాబు రోజుకు 18 గంటలు ఎలా పనిచేస్తాడు?
బాబు CM గా ఉన్నప్పుడు ఎప్పుడూ నేను మీకోసం ప్రాణాలు అర్పిస్తా అనేవాడు, నిజంగా ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాడా ?
అదే వైఎస్ ను చూడండి, నేను 10-11 గంటలు మిచి పనిచేయలేను అని చెప్పేవాడు, అంతే కాక ఎప్పుడుకూడా తను ప్రానాలిస్తాను అని చెప్పేవాడు కాదు.
వైఎస్ ఎప్పుడూ చేయకలిగిందే చెప్పవాడు, చెప్పింది చేసేవాడు కానీ బాబు అలాకాదు అదీ తేడా.
కొంత కాలం క్రితం ,కేంద్రము పెట్రోల్ ధరలు పెంచితే నిరసన తెలపడానికి తీదీపి రాష్ట్ర బంధు కు పిలుపిచ్చింది.
తీదీపి నాయకులు హైదరాబాద్ లో అన్ని షాప్ లు మూయించారు.హెరిటేజ్ మాత్రము సగం షట్టర్ తెరిచి వ్యాపారము చేస్తుంటే సాక్షి వాళ్ళు షూట్ చేసి చూపించారు.
బాబు అన్ని షాప్ లు మూయించి తన హెరిటేజ్ ను మాత్రమూ దొంగ చాటుగా వ్యాపారం చేయించాడు, అదీ మన గ్రేట్ బాబు.
బాబు CM గా ఉన్నప్పుడు మేనరిక వివాహాలు మంచివి కావు, పిల్లలు అంగ వైకల్యం తో పుడతారు అనేవాడు, ఇది నిజమే.డాక్టర్లు కూడా ఇదే చెబుతారు, మేనరిక వివాహాలు,దగ్గరి బంధువుల తో వివాహము మంచిది కాదు అని చెబుతారు.
మరి బాబు చేసిందేమిటి?
తన ఒక్కగానొక్క కొడుక్కి మేనరిక వివాహము చేయలేదా?ఎందుకు?
బాలకృష్ణ తో వియ్యమంది ,ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గర చేసుకొంటే నాల్గు ఓట్లు పడతాయి, పార్టీ లో తన నాయకత్వానికి ఎసరు ఉండదనేగా?
అసలు ఎన్టీఆర్ ఫోటో వద్దన్నా పెద్ద మనిషి బాబు, అయన మనవరాలిని కేవలము వోట్ల కోసం, CM సీట్ కోసం చేసుకొన్నాడు.అంగవైకల్యం తో పిల్లలు పుట్టినా ఫర్లేదు కానీ వోట్లు కావాలి అనే కదా?
బాబు మాటలు చేతలకు పొంతనే ఉండదు.
అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే బాబు గారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే.
పాపం బాబు మాత్రము ఏమి చేస్తాడు .
బాబు కు ముని శాపమట , నిజం చెబితే తల వెయ్యిముక్కలవుద్ది అని.
courtesy: CV Reddy
0 comments:
Post a Comment