ఈనెల 16న విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు.ఈ ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రజల్లో ఎంత బలం ఉంది అనేది ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ నిరూపించుకుంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదు ఒక డెడ్లైన్ విధించి గడువులోగానే పూర్తి చేస్తామన్నారు.
నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఒకరికంటే ఎక్కువ ఉండటం ఇబ్బందేమీకాదని వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్స సాంబశివ రాజు చెప్పారు. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సదస్సుకు వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. |
Home »
» 16న వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం
16న వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం
Written By news on Friday, June 14, 2013 | 6/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment