ఈనెల 24వ తేదీ నుంచి విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం పది నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగనుందని పాదయాత్ర కమిటీ సభ్యుడు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు ప్రసాద్రాజు సోమవారమిక్కడ వెల్లడించారు.
12-13 రోజుల పాటు జిల్లాలో సాగే పాదయాత్రలో 170- 180 కి.మీటర్ల మేర షర్మిల పర్యటించనున్నారు. విశాఖలో భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రసాద్ రాజు తెలిపారు. 11 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకుని షర్మిల ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గంలో అడుగుపెడతారు.
12-13 రోజుల పాటు జిల్లాలో సాగే పాదయాత్రలో 170- 180 కి.మీటర్ల మేర షర్మిల పర్యటించనున్నారు. విశాఖలో భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రసాద్ రాజు తెలిపారు. 11 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకుని షర్మిల ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గంలో అడుగుపెడతారు.
0 comments:
Post a Comment