మెదక్: వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 25న మెదక్ జిల్లాకు రానున్నారు. జోగిపేటలో పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్రావు, మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిలు గూడెం మహీపాల్రెడ్డి, నారాయణరెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గ సమన్వయకర్త బిడెకన్నె హనుమంతు, సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్లు రామాగౌడ్, శ్రీధర్రెడ్డి, దేశ్పాండే, నాయకులు ఎల్లు రవీందర్రెడ్డి, జైపాల్రెడ్డి, ఎం. నారాయణ, కొండల్రెడ్డి, శ్రీధర్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పార్టీ బాధ్యులను, సమన్వయకర్తలను, నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా జోగిపేటలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు నేతలు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కాగా జిల్లాకు గౌరవ అధ్యక్షురాలి హోదాలో మొదటిసారిగా రానున్న విజయమ్మకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పార్టీ బాధ్యులను, సమన్వయకర్తలను, నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా జోగిపేటలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు నేతలు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కాగా జిల్లాకు గౌరవ అధ్యక్షురాలి హోదాలో మొదటిసారిగా రానున్న విజయమ్మకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు.
0 comments:
Post a Comment