8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ

8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ) జూలై 8న ఇడుపులపాయలో జరుగుతుందని మైసూరారెడ్డి, పీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. ప్లీనరీలో రాజకీయ, ఆర్థిక, ప్రజాసమస్యలపై తీర్మానాలుంటాయని చెప్పారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు.

సంస్థాగత ఎన్నికల అధికారిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని, ప్లీనరీ నిర్వహణకు 8కమిటీల ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్లీనరీలో 26 తీర్మానాలుంటాయని, 8వేల మందిని ఆహ్వానిస్తామని తెలిపారు. ప్లీనరీ జరిగే ప్రాంతానికి వైఎస్‌ఆర్‌ ప్రాంగణంగా నామకరణం చేసినట్టు చెప్పారు. 
Share this article :

0 comments: