వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మంగళవారం (176వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సోమవారం ప్రకటించారు. చోడవరం నుంచి మంగళవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 6.3 కిలోమీటర్ల నడక అనంతరం నరసారావుపేటలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. మామిడాడలో రాత్రి బస చేస్తారు. మంగళవారం మొత్తం 14.5 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు చోడవరం, అగ్రహారం, నరసారావుపేట, మెల్లూరు క్రాస్రోడ్, వేండ్ర క్రాస్రోడ్, చింతలపల్లిలాకు, గండ్రేడులంక, మామిడాడ |
Home »
» ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా
Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment