వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో గురువారం (178వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి బుధవారం ప్రకటించారు. అచ్యుతాపురం నుంచి గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 5.1 కిలోమీటర్ల నడక అనంతరం ఇంద్రపాలెం సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 6.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. కాకినాడలోని కల్పనా సెంటర్లో సమీపంలో రాత్రి బస చేస్తారు. గురువారం మెత్తం 11.3 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : రామేశ్వరం, కొవ్వాడ, చీడిగ, ఇంద్రపాలెం, కాకినాడలోని భావనారాయణ సెంటర్, ఒన్టౌన్ పోలీస్ స్టేషన్, లక్ష్మీ టాకీస్, సెంటర్, ఎస్ఆర్కే సెంటర్, కల్పనా సెంటర్
పర్యటించే ప్రాంతాలు : రామేశ్వరం, కొవ్వాడ, చీడిగ, ఇంద్రపాలెం, కాకినాడలోని భావనారాయణ సెంటర్, ఒన్టౌన్ పోలీస్ స్టేషన్, లక్ష్మీ టాకీస్, సెంటర్, ఎస్ఆర్కే సెంటర్, కల్పనా సెంటర్
0 comments:
Post a Comment