Home »
» తెలుగువారి పరువు తీశారు
తెలుగువారి పరువు తీశారు
డెహ్రాడూన్లో కాంగ్రెస్, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగి దేశం దృష్టిలో తెలుగువారి పరువు తీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషాద సమయాల్లోనూ రాజకీయం చేస్తారనేది బుధవారం నాటి సంఘటన రుజువు చేసింది. ఉత్తరాఖండ్లో తీవ్ర వరదలు సంభవించి తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు హాయిగా అమెరికాలో గడిపిన చంద్రబాబు ఇపుడు తగుదునమ్మా అని వచ్చి ప్రచారంకోసం ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాల్సిన సమయంలో మా విమానం ఎక్కండి అంటే మా విమానం ఎక్కాలి అంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు సిగపట్లకు దిగడం ఏమిటీ? ఉత్తరాఖండ్లో తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కిరణ్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్లారుగానీ, అక్కడినుంచి బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్కు మాత్రం వెళ్లలేకపోయారు. ఒకవైపు వరదల్లో జనం కొట్టుకుపోతే సీఎం మాత్రం మద్యం అమ్మకాలు పెంచుకుని ఖజానా నింపుకోవడంపై ఆలోచిస్తూ కూర్చున్నారు. బాధ్యత గల సీఎం, బాధ్యతగల ప్రతిపక్ష నేత ఇద్దరూ ప్రజలను విస్మరించడం ఘోరం. - భూమా శోభా నాగిరెడ్డి (వైఎస్సార్ సీపీ)
|
|
0 comments:
Post a Comment