రుషికేష్: హిమాలయన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరాఖండ్ వరద బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైసూరారెడ్డి, గొల్లబాబురావు పరామర్శించారు. రుషికేష్లోని ఆంధ్ర ఆశ్రమానికి చేరుకుని అక్కడున్న వారికి ధైర్యం చెప్పారు. బాధితులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా ఉత్తరాఖండ్లో వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం సేవలు అందిస్తోంది.
'సహాయ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న బాబు'
బద్రినాథ్లో 350 మందికిపైగా తెలుగు వారున్నట్టు గుర్తించామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే 3 రోజుల్లో వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని చెప్పారు. బాధితులకు వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపామని వెల్లడించారు. డెహ్రాడూన్లో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం విమానాన్ని ఏర్పాటు చేస్తే దానిలో ఎక్కొద్దని బాధితులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.
'సహాయ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న బాబు'
బద్రినాథ్లో 350 మందికిపైగా తెలుగు వారున్నట్టు గుర్తించామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే 3 రోజుల్లో వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని చెప్పారు. బాధితులకు వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపామని వెల్లడించారు. డెహ్రాడూన్లో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం విమానాన్ని ఏర్పాటు చేస్తే దానిలో ఎక్కొద్దని బాధితులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.
0 comments:
Post a Comment