వరద బాధితులకు ఇంద్రకరణ్‌ రెడ్డి పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరద బాధితులకు ఇంద్రకరణ్‌ రెడ్డి పరామర్శ

వరద బాధితులకు ఇంద్రకరణ్‌ రెడ్డి పరామర్శ

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

న్యూఢిల్లీ: ఏపీభవన్‌లో ఉన్న ఉత్తరాఖండ్‌ వరద బాధితులను వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇంద్రకరణ్‌ రెడ్డి పరామర్శించారు. వరద బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ల ప్రజలను ఆగమేఘాలమీద ఆదుకుంటే మనరాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతుందని విమర్శించారు. 

రాష్ట్ర ప్రజలను స్వస్థలాలకు చేర్పించేందుకు తక్షణ సాయంకింద ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇంద్రకరణ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు 
Share this article :

0 comments: