పొర్లుదండాలు పెట్టినా బాబు గెలవలేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పొర్లుదండాలు పెట్టినా బాబు గెలవలేరు

పొర్లుదండాలు పెట్టినా బాబు గెలవలేరు

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

ప్రజలను నట్టేట ముంచిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా, పొర్లుదండాలు పెట్టినా గెలవడం అసాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీలో సమరశంఖం పేరుతో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. 50 వేల మంది జనాభా ఉన్న ఈ పంచాయతీ నుంచి దాదాపు 12 వేల మందికి పైగా స్థానికులు మహాధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటారు. ధర్నాలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన చందాన దివంగత వైఎస్ పెట్టిన పుట్టలో పాములా కిరణ్ చేరి, ప్రజలపై పగ సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గమైన పీలేరుకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ, అక్కడ తన వ్యక్తిగత విజయానికి బాటలు వేసుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని, ముఖ్యంగా తిరుపతి ప్రజలు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని సీఎం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభంజనంలా దూసుకొచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయన్ని జైలులో పెట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లయితే జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చి ఉండేవారమని, గత ఉపఎన్నికల్లో ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారని గుర్తుచేశారు. వైఎస్ జీవించి ఉంటే ఎంఆర్ పల్లికి గాలేరునది నీటిని మళ్లించేందుకు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చి ఉండేవని చెప్పారు. వైఎస్సార్ సీపీ తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకుడు వరప్రసాదరావు ప్రసంగించారు. - 
Share this article :

0 comments: