డెహ్రాడూన్ లో టిడిపి,కాంగ్రెస్ ఎంపిల తోపులాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డెహ్రాడూన్ లో టిడిపి,కాంగ్రెస్ ఎంపిల తోపులాట

డెహ్రాడూన్ లో టిడిపి,కాంగ్రెస్ ఎంపిల తోపులాట

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

ఉత్తరాఖండ్ విపత్తు బాధితులను హైదరాబాద్ తరలించే విషయంలో డెహ్రాడూన్ విమానాశ్రయంలో టిడిపి,కాంగ్రెస్ ఎంపిలు ఒకరినొకరు తోచుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. బాధితులను తాము తీసుకువెళతామంటే తాము తీసుకువెళతామని ఎంపిలు రమేష్ రాథోడ్, వి.హనుమంతరావు తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఒకరినొకరు గట్టిగా తోచుకున్నారు.

ఇప్పుడు నిజంగానే వరద రాజకీయం జరుగుతున్నట్లు కనిపిస్తుంది.డెహ్రాడూన్ వద్ద తమ బస్ ఎక్కాలంటే, తమ బస్ ఎక్కాలని కాంగ్రెస్,టిడిపి నేతలు పోటీపడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.ఒక దశలో రాజ్యసభ సభ్యుడు ,కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆదిలాబాద్ టిడిపి ఎమ్.పి రమేష్ రాధోడ్ లు ఒకరినొకరు తోసుకున్నారు.మరో దశలో కేంద్ర మంత్రి బలరాం నాయక్ రమేష్ రాధోడ్ లు ఘర్షణపడ్డారు.ఈ గొడవలో టిక్కెట్ చించివేయడానికి కూడా కొందరు ప్రయత్నించారు.టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇది జరగడం విశేషం. తమ బస్ ఎక్కాలంటే , తమ బస్ ఎక్కాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఐదువేల రూపాయలు ఇచ్చి పంపుతుంటే టిడిపి ఎందుకు అడ్డుపడుతోందని హనుమంతరావు ప్రశ్నించారు.మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు టిడిపి నేతలు అడ్డుపడడమేమిటని అన్నారు.దానికి తాము అడ్డుపడడం లేదని, ముందుగా చంద్రబాబు ఇక్కడకు వచ్చి మూడు రోజులుగా బస చేశారని బందరు ఎమ్.పి నారాయణ రావు అన్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20130626_19.php

http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=18402&category=headlines

Share this article :

0 comments: