పూతలపట్టు: ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీరజవాన్ వినాయకం కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ నేత మిథున్ రెడ్డి పరామర్శించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లె గ్రామానికి చెందిన వినాయకం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కృష్ణ, రాణెమ్మ దంపతులకు వినాయకం ఏకైక కుమారుడు. తండ్రి కూలీనాలీ చేసి అతడిని డిగ్రీ వరకు చదివించాడు. వినాయకం 2009లో ఎన్డీఆర్ఎఫ్లో జవానుగా చేరాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయపడేవాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ మధ్యనే వినాయకానికి కూడా అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయాడు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లె గ్రామానికి చెందిన వినాయకం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కృష్ణ, రాణెమ్మ దంపతులకు వినాయకం ఏకైక కుమారుడు. తండ్రి కూలీనాలీ చేసి అతడిని డిగ్రీ వరకు చదివించాడు. వినాయకం 2009లో ఎన్డీఆర్ఎఫ్లో జవానుగా చేరాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయపడేవాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ మధ్యనే వినాయకానికి కూడా అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయాడు.
0 comments:
Post a Comment