ఆరు నెలల తర్వాత తొలిసారి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరు నెలల తర్వాత తొలిసారి

ఆరు నెలల తర్వాత తొలిసారి

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

Photo
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి. విజయసాయిరెడ్డిలను పోలీసులు శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. జగన్ కంపెనీల్లో దాల్మియా, భారతి సిమెంట్స్ కంపెనీ పెట్టుబడులపై సీబీఐ సమర్పించిన ఐదో చార్జిషీట్(సీసీ నెంబర్ 12/2013)కు సంబంధించి వీరిని నేరుగా హాజరుపరచాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఆదేశించడంతో పోలీసులు ఆ మేరకు వీరిని తీసుకొచ్చారు. న్యాయమూర్తి వీరి హాజరును నమోదు చేసుకున్నారు. చివరిసారిగా జగన్ గత డిసెంబర్ 5న నేరుగా కోర్టుకు హాజరయ్యారు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన జైలు బయటి ప్రపంచాన్ని చూశారు.



వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివా సులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గుర్నాథరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ శివభరత్ రెడ్డి తదితరులు శుక్రవారం కోర్టుకు వచ్చారు.
Share this article :

0 comments: