మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర నేటికి 191వ రోజుకు చేరింది. షర్మిల బుధవారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని కృష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్త బయ్యపురెడ్డిపాలెం, బలిగట్టం, ఆబిడ్ సెంటర్, నర్సీపట్నం, బొడ్డెపల్లి జంక్షన్, శ్రీరాంనగర్, లక్ష్మీపురం మీదుగా పాదయాత్ర సాగుతుంది. నర్సీపట్నంలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ 12.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
కొత్త బయ్యపురెడ్డిపాలెం, బలిగట్టం, ఆబిడ్ సెంటర్, నర్సీపట్నం, బొడ్డెపల్లి జంక్షన్, శ్రీరాంనగర్, లక్ష్మీపురం మీదుగా పాదయాత్ర సాగుతుంది. నర్సీపట్నంలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ 12.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
0 comments:
Post a Comment