చీకటి ఒప్పందాలతో తాను దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీయాత్రకు వెళ్లారని తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి తన ముగ్గురు ఎంపీలను ఓటు వేయకుండా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు భారీగా ముడుపులు ముట్టాయన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డబ్బును, మహానాడులో చందాల రూపంలో వచ్చిన దాన్ని దాచుకోవడానికి ఆయన విదేశీ యాత్రలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం సమయంలో అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర పేరుతో తిరుగుతూ కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా విదేశాలకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు వివరించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా ఇటువంటి నీతిమాలిన, ప్రజలను వంచించిన నాయకుడు లేరని, ఇకముందు పుట్టబోరని ఆయన విరుచుకుపడ్డారు
Home »
» దాచుకోవడానికే బాబు విదేశీ యాత్ర
దాచుకోవడానికే బాబు విదేశీ యాత్ర
Written By news on Monday, June 17, 2013 | 6/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment