ఏడాదిన్నరగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ జనం చూస్తూనే ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ‘మేమే తెలివిగలవాళ్లం, మాకు ఎదురులేదు, మాకెవరి అవసరమూ లేదు’ అనుకుంటూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాభీష్టానికీ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ అరెస్టు అలాంటిదే. ఆయన్ని బెయిల్పై బయటికి రానివ్వకుండా అడ్డుకోవడమూ అలాంటిదే. జగన్ని జైలుకు పంపామని విర్రవీగుతున్న ఈ నాయకులంతా ఓ విషయం తెలుసుకోవాలి. ఈ లోకం కుటిల రాజకీయాల వల్ల నడవడం లేదు.
కేవలం మంచివారి వల్ల నడుస్తోంది. అలాంటి మంచి వ్యక్తి జగన్గారు. కష్టం వస్తే తమకు చేయి అందించేది జగన్ మాత్రమేనని ప్రజలు గుర్తించారన్న వాస్తవాన్ని ఇంకా గ్రహించే స్థితిలో లేవు ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. ఒక సంవత్సరం రోజులు జగన్ జైల్లో ఉన్నా నేను, నా పిల్లలు బతకగలిగామంటే, దేవుని దయ అని భారతిగారు అన్నారు. ‘దేవుని మీద నమ్మకం’ అనే మాటను మంచివాళ్లు మాత్రమే మాట్లాడగలరు. ఇతరులకు మన ద్వారా మేలు జరగాలి కానీ కీడు జరగకూడదని జగన్ కుటుంబం నమ్ముతోంది. ఆ కుటుంబాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన మనిషిగా ప్రజల కోసం నిలబడి పోరాడాడు జగన్. దేవుడు ఆయనకు మంచి చేస్తాడు. ఆయన ద్వారా ప్రజలకు మంచి జరిగేలా దీవిస్తాడు.
- జొన్నకూటి రోసిబాబు, భవానీపురం, విజయవాడ
ఇదేం వింతధోరణి?
జగనన్న విలువైన సమయాన్ని, అమూల్యమైన కుటుంబ బంధాలను, ప్రజల నరనరాల్లో ప్రవహిస్తున్న అభిమానాన్ని, కోట్ల ప్రజల ఆశల్ని ఏడాది కాలంగా ఈ పాలకులు జైలు గోడల మధ్య బంధించారు. ప్రజల పక్షాన పోరాడే నాయకుడిని ఇలా బందీగా ఉంచడం మాకు బాధను కలిగిస్తోంది. అధికారం చేతిలో ఉందని ఒక ప్రజానాయకుడిని వేధిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకోరు. అవకాశం వచ్చినప్పుడు తగిన రీతిలో ఈ కుటిల నాయకులకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెబుతారు. చిలుకకి జ్యోతిషుడు శిక్షణ ఇచ్చి ఏం చెప్పమంటే అది చెబుతుంది. ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఏం చెప్పమంటే అది ఈ సీబీఐ చెబుతోంది.
కడప పార్లమెంట్ స్థానంలో ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో ‘మేము జగన్ వెంటే ఉన్నాము’ అని తీర్పు చెప్పి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించారు ప్రజలు. ఇంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని దేశం మొత్తంలో ఒక్కరినైనా చూడగలమా? ప్రజల ఆత్మబంధువైన జగనన్నని జైల్లో వేసిన సీబీఐ... ప్రజాకంటకుడైన చంద్రబాబుని ఎందుకు విచారించలేకపోయింది? గవర్నమెంటుకి సీబీఐ ఊడిగం చేస్తున్న మాట నిజం కాకపోతే రాబర్ట్ వాద్రా తదితర స్కామ్ మాస్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? కోల్ స్కామ్, 2జీ స్కామ్ చేసిన వాళ్లు బయట ఉండి సాక్షులను ప్రభావితం చేయరా? ప్రజాభిమానం తప్ప ఏ అధికారమూ లేని మా జగనన్న ప్రభావితం చేస్తాడా? ఇదేం వింత ధోరణి? జగనన్న అభిమానిగా, ఓటు హక్కు ఉన్న యువకుడిగా నేను కోరుకునేది ఒక్కటే. అన్న విడుదలవ్వాలి. అన్న సీఎం. అవ్వాలి. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోవాలి.
- మధురెడ్డి, ఇ-మెయిల్
చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
కేవలం మంచివారి వల్ల నడుస్తోంది. అలాంటి మంచి వ్యక్తి జగన్గారు. కష్టం వస్తే తమకు చేయి అందించేది జగన్ మాత్రమేనని ప్రజలు గుర్తించారన్న వాస్తవాన్ని ఇంకా గ్రహించే స్థితిలో లేవు ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. ఒక సంవత్సరం రోజులు జగన్ జైల్లో ఉన్నా నేను, నా పిల్లలు బతకగలిగామంటే, దేవుని దయ అని భారతిగారు అన్నారు. ‘దేవుని మీద నమ్మకం’ అనే మాటను మంచివాళ్లు మాత్రమే మాట్లాడగలరు. ఇతరులకు మన ద్వారా మేలు జరగాలి కానీ కీడు జరగకూడదని జగన్ కుటుంబం నమ్ముతోంది. ఆ కుటుంబాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన మనిషిగా ప్రజల కోసం నిలబడి పోరాడాడు జగన్. దేవుడు ఆయనకు మంచి చేస్తాడు. ఆయన ద్వారా ప్రజలకు మంచి జరిగేలా దీవిస్తాడు.
- జొన్నకూటి రోసిబాబు, భవానీపురం, విజయవాడ
ఇదేం వింతధోరణి?
జగనన్న విలువైన సమయాన్ని, అమూల్యమైన కుటుంబ బంధాలను, ప్రజల నరనరాల్లో ప్రవహిస్తున్న అభిమానాన్ని, కోట్ల ప్రజల ఆశల్ని ఏడాది కాలంగా ఈ పాలకులు జైలు గోడల మధ్య బంధించారు. ప్రజల పక్షాన పోరాడే నాయకుడిని ఇలా బందీగా ఉంచడం మాకు బాధను కలిగిస్తోంది. అధికారం చేతిలో ఉందని ఒక ప్రజానాయకుడిని వేధిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకోరు. అవకాశం వచ్చినప్పుడు తగిన రీతిలో ఈ కుటిల నాయకులకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెబుతారు. చిలుకకి జ్యోతిషుడు శిక్షణ ఇచ్చి ఏం చెప్పమంటే అది చెబుతుంది. ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఏం చెప్పమంటే అది ఈ సీబీఐ చెబుతోంది.
కడప పార్లమెంట్ స్థానంలో ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో ‘మేము జగన్ వెంటే ఉన్నాము’ అని తీర్పు చెప్పి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించారు ప్రజలు. ఇంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని దేశం మొత్తంలో ఒక్కరినైనా చూడగలమా? ప్రజల ఆత్మబంధువైన జగనన్నని జైల్లో వేసిన సీబీఐ... ప్రజాకంటకుడైన చంద్రబాబుని ఎందుకు విచారించలేకపోయింది? గవర్నమెంటుకి సీబీఐ ఊడిగం చేస్తున్న మాట నిజం కాకపోతే రాబర్ట్ వాద్రా తదితర స్కామ్ మాస్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? కోల్ స్కామ్, 2జీ స్కామ్ చేసిన వాళ్లు బయట ఉండి సాక్షులను ప్రభావితం చేయరా? ప్రజాభిమానం తప్ప ఏ అధికారమూ లేని మా జగనన్న ప్రభావితం చేస్తాడా? ఇదేం వింత ధోరణి? జగనన్న అభిమానిగా, ఓటు హక్కు ఉన్న యువకుడిగా నేను కోరుకునేది ఒక్కటే. అన్న విడుదలవ్వాలి. అన్న సీఎం. అవ్వాలి. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోవాలి.
- మధురెడ్డి, ఇ-మెయిల్
చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
0 comments:
Post a Comment