ఎన్నికల నగారా ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేట్టుగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలువు ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సదస్సు ముగిసింది. ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జగన్కు కానుకగా ఇద్దాం అన్నారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో కృషి చేసి వైఎస్ఆర్సీపీ గెలుపొందేలా కృషిచేయాలన్నారు. దేవుని దయవల్ల జగన్ త్వరలోనే విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ విజయోత్సవ సభలో జగన్
మీతో కలిసి పాల్గొనే అవకాశం దేవుడు కల్పిస్తాడన్నారు.
రైతులు క్రాప్ హాలీడే, పరిశ్రమలవారు పవర్ హాలీడే ప్రకటించారు. దీంతో వేలాది మంది అన్నదాతలు, కార్మికులు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు మనం హాలీడే ప్రకటించాలని విజయమ్మ అన్నారు. ప్రతీ పంచాయతీ మీద వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడించాలన్నారు. జగన్బాబు ఆధ్వర్యంలో రాజశేఖర్రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు విజయమ్మ పిలుపునిచ్చారు.
మీతో కలిసి పాల్గొనే అవకాశం దేవుడు కల్పిస్తాడన్నారు.
రైతులు క్రాప్ హాలీడే, పరిశ్రమలవారు పవర్ హాలీడే ప్రకటించారు. దీంతో వేలాది మంది అన్నదాతలు, కార్మికులు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు మనం హాలీడే ప్రకటించాలని విజయమ్మ అన్నారు. ప్రతీ పంచాయతీ మీద వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడించాలన్నారు. జగన్బాబు ఆధ్వర్యంలో రాజశేఖర్రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు విజయమ్మ పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment