ఆదివారం 14.1 కిలోమీటర్ల నడక..
ఆదివారం 188 వరోజు పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కేఈ చిన్నయ్యపాలెం, తిమ్మరాజుపేట, కేఎస్ కొత్తూరు, పాతకొట్టాం, కొత్తకొట్టాం, లక్ష్మీదేవిపేట, కోటనందూరు మీదుగా కాకరాపల్లి చేరుకుంది. కాకరాపల్లి వద్ద 2,500 కిలోమీటర్ల మైలు రాయిని షర్మిల అధిగమించినట్లు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 14.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,500.5 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పార్టీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కృష్ణదాసు, గురునాథ్రెడ్డి, శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ ఎంపీ వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, జగ్గిరెడ్డి, ప్రసాదరాజు, దొరబాబు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, నేతలు దాడి వీరభద్రరావు, జక్కంపూడి విజయలక్ష్మి, వెంకటరమణ, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు చెలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణ చౌదరి, దాడిశెట్టి రాజా, ఆకుల వీర్రాజు, బొమ్మన రాజ్కుమార్, సత్తి సూర్యనారాయణరెడ్డి, విప్పర్తి వేణుగోపాల్, అనంతబాబు, చింత కృష్ణమూర్తి, బొంతు రాజేశ్వర్రావు, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, మందపాటి కిరణ్కుమార్, మట్టా శైలజా, చింతలపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాష్, తోట సుబ్బారావు, చెల్లుబోయిన వేణు, స్థానిక నాయకుడు జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=624552&Categoryid=1&subcatid=33#sthash.TtOLfVro.dpuf
0 comments:
Post a Comment