వైఎస్ఆర్ సీపీ జెండా రెపరెపలాడాలి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ జెండా రెపరెపలాడాలి: విజయమ్మ

వైఎస్ఆర్ సీపీ జెండా రెపరెపలాడాలి: విజయమ్మ

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

ప్రతి పంచాయతీలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు చిలకలూరిపేట వచ్చిన ఆమె సోమవారం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సమిష్టిగా పని చేసి... పంచాయతీలను గెలిచి వైఎస్ జగన్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు జరపకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విజయమ్మ విమర్శించారు. నవంబర్ వరకూ జగన్ బయటకు రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆమె మండిపడ్డారు. అలా చేస్తే పార్టీని పటిష్టం చేస్తానని కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారని విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రి కుట్ర రాజకీయాలకు ప్రజలే బుద్ది చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. పొన్నూరు నియోజకవర్గంలో నంబూరుకు చెందిన డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఉయ్యూరు సతీష్ రెడ్డి ...విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Share this article :

0 comments: