దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. సభ నుంచి టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం శాసనసభా సమావేశాల తీరుపై ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యల గురించి ఏమాత్రం చర్చించకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండిపోతోందని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకూడదన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
Home »
» అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వైఎస్సార్సీపీ ఆవేదన
అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వైఎస్సార్సీపీ ఆవేదన
Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. సభ నుంచి టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం శాసనసభా సమావేశాల తీరుపై ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యల గురించి ఏమాత్రం చర్చించకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండిపోతోందని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకూడదన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment