Home »
» బోనులో ఉన్నా...సింహం సింహమే...
బోనులో ఉన్నా...సింహం సింహమే...
డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదల జీవితాలు మెరుగయ్యాయి. అయితే ఆయన హఠార్మరణం తర్వాత ప్రజాసమస్యలను పట్టించుకునే నాయకులే కరువయ్యారు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. పేదల మనిషి, మహనీయుడు, ప్రజల ఆరాధ్య దైవం వైఎస్సార్పై ఈ వెన్నుపోటు చంద్రబాబు అండ్ కో ప్రతిరోజూ బురదచల్లుతూ, దుష్ర్పచారం చేస్తూ ఉంటే మనసుకు బాధ కలుగుతోంది. కాని ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయ నాయకులో? ఎవరు ప్రజానాయకులో? కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు బృందానికి తోడవుతున్నారు. అయితే వీళ్లందరికీ తెలియని విషయం ఏమిటంటే... సరైన సమయంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు వీరికి ముచ్చెమటలు పట్టే విధంగా సమాధానం చెప్పబోతున్నారు. ఇచ్చిన మాటకోసం గడిచిన మూడేళ్లుగా కష్టాలను అనుభవిస్తున్న నాయకుడు జగన్. ఆయన అంటే ఉన్న భయంతో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు సీబీఐతో కలిసి కుట్ర పన్ని జైల్లో నిర్బంధించారు. అలాగని మేము డీలాపడిపోలేదు. పాదయత్రలో షర్మిలక్క మాట్లాడుతూ ‘జగనన్న ఏ తప్పూ చేయలేదు. బోనులో ఉన్నా సింహం సింహమే. ఉదయించే సూర్యుణ్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు’ అని చెప్తుంటే రాష్ట్రంలోని వైఎస్సార్, జగన్ అభిమానులకు ఎంతో ధైర్యంగా, ఆనందంగా ఉంది. నేను చెప్పేదొకటే. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఈ నమ్మకద్రోహ కాగ్రెస్ నాయకులు, వారితో చేతులు కలిపిన తెలుగుదేశం పార్టీ నేతలు విర్రవీగితే ఏమవుతుందో త్వరలో కాలమే నిర్ణయించబోతోంది. జగన్ త్వరలోనే బయటకు వస్తారు. అప్పటివరకు అభిమానులంతా ధైర్యంగా ఉండి, వైఎస్సార్ కుటుంబ సభ్యులకు మన అభిమానంతో ధైర్యాన్ని నింపాలి. జగన్పై జరుగుతున్న కుట్రలకు, కుతంత్రాలకు వచ్చే ఎన్నికలతో తెరపడి తీరుతుంది. - ఎన్.జితేంద్ర, ఎం.బి.ఎ, నెల్లూరు
|
|
0 comments:
Post a Comment