* మాట వినలేదని జైలుకు పంపుతారా?
* జగన్కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే కుట్రలు
* ఏం నేరం చేశారని ఏడాదిగా జైల్లో ఉంచారు?
* ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ర్పచారం
* కాంగ్రెస్, టీడీపీ కుట్రలను ప్రజలు తరిమికొడతారు
* సీబీఐ విశ్వసనీయత కోల్పోయింది
* ‘సాక్షి’ చైతన్య పథంలో జనాగ్రహం
‘భర్తను పోగొట్టుకుని ఓ పక్క, కొడుకును జైల్లో ఉంచారని మరో పక్క విజయమ్మ కుమిలిపోతోంది.. ఏడాదిగా ఆ బిడ్డడిని జైల్లో పెట్టారు.. నాన్నాళ్లు ఊరికి పోతేనే భార్యా పిల్లలు అంగలాస్తారు.. అట్లాంటిది పాపం భారతమ్మ, వారి పిల్లలు ఎంత బాధ పడుతున్నారో తలుచుకుంటేనే ఏడుపొత్తోంది. ఈనిగాండ్ల దురమారగపు కుతంతరాలు సూత్తుంటే రాజకీయాలంటేనే తూ.. అనిపిత్తోంది. ఇన్ని పథకాలెట్టి అందరికీ ఆపుతుడైన మహానేత కుటుంబాన్ని ఈ రోజు ఇట్లా వేధిస్తున్న వారికి పోగాలం దాపురించిం ద’౦టూ రామక్క, ఈశ్వరమ్మ అనే మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతపురం సిటీ, న్యూస్లైన్ : ‘మాట వింటే బెయిలు, లేదంటే జైలు అన్న పంథాను కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నానాటికీ పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక... కుట్ర పన్ని కేసుల్లో ఇరికించారు. ఏడాదిగా జైల్లో పెట్టించారు. ప్రజాసేవ చేసిన మహానేత కుటుంబానికి తీరని వ్యథ మిగిల్చారు. ప్రజల నుంచి మంచి నాయకుణ్ని దూరం చేశారు. కాంగ్రెస్ కుట్రలు ఇక ఎంతో కాలం సాగవు. తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయపడ్డారు. అనంతపురం నగరంలోని సాయి ఫంక్షన్ హాలులో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘చైతన్యపథం’ నిర్వహించారు. ఎం.నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ నజీర్ అహ్మద్, ప్రొఫెసర్లు రామాంజనేయులు, రమణారెడ్డి, విద్యావేత్త జగన్మోహన్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం సుజాత, ఇతర వక్తలు మాట్లాడుతూ జగన్ మోహన్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించడంతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు.
కాంగ్రెస్కుఎదురు తిరిగినందుకే సీబీఐతో అక్రమ కేసులు పెట్టించిందని విమర్శించారు. గతంలో ఏ కేసులోనూ లేనివిధంగా జగన్ కేసులో పరిమితికి మించి చార్జిషీట్లు దాఖలు అవుతున్నాయన్నారు. ఈ తరహా దర్యాప్తు తామెన్నడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ దురుద్దేశపూరిత వైఖరి వల్లే జగన్ను ఏడాదికి పైగా విచారణ పేరుతో జైల్లో నిర్బంధించారని స్పష్టం చేశారు. అనుకూలంగా ఉన్నవారిపై ఒక రకంగా, వ్యతిరేకించే వారిపై మరో రకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ కూడా అధికార పార్టీతో కుమ్మక్కైందని దుయ్యబట్టారు. జగన్ను జైలు గోడలకే పరిమితం చేయాలనే దురుద్దేశంతో ఉమ్మడి కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. జగన్పై కేసులకు సంబంధించి సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు కక్ష పూరితమైందన్నారు. దీనికి తోడు ఓ వర్గం మీడియా విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా వ్యవహరిస్తోందని, ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. మహానేత మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో కోత విధిస్తోందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను సైతం ఎత్తేసేందుకు పావులు కదుపుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను సీఎం చేస్తే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుని కుటుంబాన్ని అదేపనిగా ఇబ్బంది పెడుతున్న తీరును చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నామని రామక్క, ఈశ్వరమ్మ అనే మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. జరుగుతున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కుమ్మక్కైన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
* జగన్కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే కుట్రలు
* ఏం నేరం చేశారని ఏడాదిగా జైల్లో ఉంచారు?
* ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ర్పచారం
* కాంగ్రెస్, టీడీపీ కుట్రలను ప్రజలు తరిమికొడతారు
* సీబీఐ విశ్వసనీయత కోల్పోయింది
* ‘సాక్షి’ చైతన్య పథంలో జనాగ్రహం
అనంతపురం సిటీ, న్యూస్లైన్ : ‘మాట వింటే బెయిలు, లేదంటే జైలు అన్న పంథాను కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నానాటికీ పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక... కుట్ర పన్ని కేసుల్లో ఇరికించారు. ఏడాదిగా జైల్లో పెట్టించారు. ప్రజాసేవ చేసిన మహానేత కుటుంబానికి తీరని వ్యథ మిగిల్చారు. ప్రజల నుంచి మంచి నాయకుణ్ని దూరం చేశారు. కాంగ్రెస్ కుట్రలు ఇక ఎంతో కాలం సాగవు. తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయపడ్డారు. అనంతపురం నగరంలోని సాయి ఫంక్షన్ హాలులో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘చైతన్యపథం’ నిర్వహించారు. ఎం.నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ నజీర్ అహ్మద్, ప్రొఫెసర్లు రామాంజనేయులు, రమణారెడ్డి, విద్యావేత్త జగన్మోహన్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం సుజాత, ఇతర వక్తలు మాట్లాడుతూ జగన్ మోహన్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించడంతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు.
కాంగ్రెస్కుఎదురు తిరిగినందుకే సీబీఐతో అక్రమ కేసులు పెట్టించిందని విమర్శించారు. గతంలో ఏ కేసులోనూ లేనివిధంగా జగన్ కేసులో పరిమితికి మించి చార్జిషీట్లు దాఖలు అవుతున్నాయన్నారు. ఈ తరహా దర్యాప్తు తామెన్నడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ దురుద్దేశపూరిత వైఖరి వల్లే జగన్ను ఏడాదికి పైగా విచారణ పేరుతో జైల్లో నిర్బంధించారని స్పష్టం చేశారు. అనుకూలంగా ఉన్నవారిపై ఒక రకంగా, వ్యతిరేకించే వారిపై మరో రకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ కూడా అధికార పార్టీతో కుమ్మక్కైందని దుయ్యబట్టారు. జగన్ను జైలు గోడలకే పరిమితం చేయాలనే దురుద్దేశంతో ఉమ్మడి కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. జగన్పై కేసులకు సంబంధించి సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు కక్ష పూరితమైందన్నారు. దీనికి తోడు ఓ వర్గం మీడియా విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా వ్యవహరిస్తోందని, ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. మహానేత మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో కోత విధిస్తోందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను సైతం ఎత్తేసేందుకు పావులు కదుపుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను సీఎం చేస్తే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుని కుటుంబాన్ని అదేపనిగా ఇబ్బంది పెడుతున్న తీరును చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నామని రామక్క, ఈశ్వరమ్మ అనే మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. జరుగుతున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కుమ్మక్కైన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
0 comments:
Post a Comment