జగనన్నను అవినీతిపరుడని ఆరోపించింది ప్రజలు కాదు.. శంకర్రావు మాత్రమేనని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దొమ్మేరు సభలో షర్మిల అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మాఫీయా డాన్ బొత్స సత్యనారాయణ అని షర్మిల ఆరోపించారు. గాంధీ సిద్ధాంతాలే ఆదర్శమని చెబుతూ మాఫీయాడాన్కు పదవిని కట్టబెట్టారు అని షర్మిల మండిపడ్డారు.
వైఎస్ ఎంత మంచివారో... మీ భార్య, బావమరిదిని అడిగితే చెబుతారని బొత్సను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు చేశారు. వైఎస్ అమలు చేసిన పథకాలన్ని ఆయనవేనని.. అందుకే వైఎస్ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో పెట్టామని షర్మిల అన్నారు. ఒక వేళ సిగ్గుపడాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి అని.. సీబీఐ .. కాంగ్రెస్ గుంటనక్క, పంజరంలో చిలుక అని షర్మిల అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొమ్ముకాస్తోంది చంద్రబాబేనని షర్మిల అన్నారు
వైఎస్ ఎంత మంచివారో... మీ భార్య, బావమరిదిని అడిగితే చెబుతారని బొత్సను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు చేశారు. వైఎస్ అమలు చేసిన పథకాలన్ని ఆయనవేనని.. అందుకే వైఎస్ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో పెట్టామని షర్మిల అన్నారు. ఒక వేళ సిగ్గుపడాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి అని.. సీబీఐ .. కాంగ్రెస్ గుంటనక్క, పంజరంలో చిలుక అని షర్మిల అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొమ్ముకాస్తోంది చంద్రబాబేనని షర్మిల అన్నారు
0 comments:
Post a Comment