ముఖ్యమంత్రిని నిలదీసిన వైఎస్సార్ సీఎల్పీ
ఆ జీవోలన్నీ సక్రమమని అసెంబ్లీలో చెప్పినట్లే హైకోర్టుకు చెప్పలేదేం?
జగన్మోహన్రెడ్డి నిరపరాధిగా నిర్ధారణవుతుందని భయపడ్డారా?
సంతకాలు చేసిన మంత్రులు కాకుండాఅధికారంలో భాగం కాని జగన్ దోషి ఎలా అవుతారు?
కిరణ్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు కోరారు.. మరి ఇప్పుడు మౌనం ఎందుకు?
వైఎస్సార్ సీఎల్పీ ప్రశ్నలు...
మంత్రులు జీవోలు జారీ చేయటంలో ఎలాంటి తప్పు చేయలేదని, క్విడ్ ప్రో కో లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు. క్విడ్ ప్రో కో లేకుంటే జగన్పైన కేసు ఎందుకు?
జీవోల జారీ అంతా నిబంధనలకు అనుగుణంగానే జరిగితే మరి క్విడ్ ప్రో కో ఎక్కడుంది?
నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేసిన మంత్రులు తప్పు చేయకుండా.. అధికారంలో ఒక్క రోజు కూడా భాగం కాని, ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కాని జగన్ ఎలా దోషి అవుతారు?
మంత్రులది తప్పు కాకుంటే హైకోర్టు నిర్దిష్టంగా అడిగినా అప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు?
జగన్ను ఉచ్చులో బిగించాలని ప్రభుత్వం అప్పుడు మౌనం దాల్చిందా? ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మంత్రులను సమర్థిస్తూ సీఎం చెప్తున్న మాటలు అప్పుడు కోర్టుకు ఎందుకు చెప్పలేదు?
ఇవే మాటలు అప్పుడు కోర్టుకు చెప్పి ఉంటే జగన్ నిరపరాధి అని నిర్ధారణ అవుతుందని భయపడ్డారా?
రాజీనామాలు చేసినంత మాత్రాన పొరపాట్లు చేసినట్లు కాదంటున్నారు. అభియోగాలున్నంత మాత్రాన జగన్ను ఎలా తప్పుపడతారు? అప్పుడు టీడీపీ పైన మౌనం ఎందుకు? ఇప్పుడు అదే పార్టీపైన కాలుదువ్వటం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: సీబీఐ కేసుతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఉచ్చు బిగించాలన్న ఉద్దేశంతోనే.. ఆ కేసులోని జీవోల వ్యవహారంపై హైకోర్టు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని అసెంబ్లీ వేదికగా సీఎం కిరణ్కుమార్రెడ్డి, మంత్రులు చెప్తున్న మాటలతో తేటతెల్లమయింద ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఎండగట్టింది. ‘‘ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏ తప్పులూ జరగలేదని సీఎం, మంత్రులు అసెంబ్లీలో చెప్పిన మాటలను ఆనాడు హైకోర్టుకు చెబితే జగన్మోహన్రెడ్డి నిరపరాధిగా నిర్ధారణ అవుతుందని భయపడ్డారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు శోభానాగిరెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ్రెడ్డి, కె.శ్రీనివాసులతో కలిసి ఆమె మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై ఉచ్చు బిగించవచ్చని, మంత్రుల మెడకు చుట్టుకునే దాకా ఈ కేసు రాదనే భావనతోనే ప్రభుత్వం ఆనాడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని శోభ ఉద్ఘాటించారు. ‘‘ఇప్పుడు మంత్రుల మెడకూ చుట్టుకోవటంతో ఆ జీవోలన్నీ నిబంధనలు ప్రకారం జారీ అయ్యాయన్న విషయాన్ని బలంగా చెప్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో వాళ్ల మాటలతోనేజగన్మోహన్రెడ్డి నిర్దోషి అని తేలిపోతోంది’’ అని పేర్కొన్నారు. ‘‘మంత్రులు జీవోలు జారీ చేయటంలో క్విడ్ ప్రో కో లేదని సీఎం చెప్తున్నారు. క్విడ్ ప్రో కో లేకుంటే జగన్పైన కేసు ఎందుకు? నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేసిన మంత్రులు తప్పు చేయకుండా.. అధికారంలో ఒక్క రోజు కూడా భాగం కాని, ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కా ని జగన్ ఎలా దోషి అవుతారు?’’ అని శోభానాగిరెడ్డి ప్రశ్నిం చారు. మంత్రులు రాజీనామాలు చేసినంత మాత్రాన పొరపాట్లు చేసినట్లు కాదంటున్న వారు.. అభియోగాలున్నంత మాత్రాన ఆయన్ను ఎలా తప్పుపడతారని ఆమె నిలదీశారు.
అసెంబ్లీ వేదికగా టీడీపీ రాజకీయ డ్రామాలు: అధికార కాంగ్రెస్ పార్టీతో అన్ని విధాల కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. దొంగే దొంగ అని అరిచినట్టు తమను కాంగ్రెస్తో కుమ్మక్కయ్యామని ఆరోపణలు చేస్తోంద ని శోభానాగిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ వేదికగా వారు కొత్త డ్రామా మొదలు పెట్టారని దుయ్యబట్టారు. వాళ్ల కుమ్మక్కు రాజకీయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దొంగలబండికి నాయకుడని విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. మొన్నటి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడారని ఆమె నిలదీశారు. ‘‘అప్పుడు అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇప్పుడు వారు కళంకిత మంత్రులంటున్న వారితో సహా ప్రభుత్వమే ఉండేది కాదుకదా?’’ అని ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్షాలు అవిశ్వాసానికి మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని కాపాడింది టీడీపీ ఒక్కటేనని గుర్తుచేశారు. ‘‘తోక పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని.. తర్వాత తామే అవిశ్వాస తీర్మానం పెడతామని పాదయాత్రలో చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టటానికి ఎందుకు ముందుకు రావటం లేదు?’’ అని ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరోవైపు ప్రజలను మభ్యపెట్టేందుకు మంత్రులపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ తీరును దుయ్యబట్టారు. తామే కనుక కాంగ్రెస్తో కుమ్మక్కు అయితే ఏడాదిగా జగన్మోహన్రెడ్డి జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ‘‘జగన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో కేసు వేస్తేనే, అదే కేసులో టీడీపీ నేతలు ఇంప్లీడ్ అయిన విషయం వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు.
బాబుపై మీ ఆరోపణలను సీబీఐకి ఎందుకివ్వరు?
ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ సహకరిస్తున్న కారణంగానే ఐఎంజీ భూ కేటాయింపుల వ్యవహారంలో చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు జరగటం లేదని శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. కిరణ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఐఎంజీ భూముల వ్యవహారంలో బాబుపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడాయనే సీఎంగా ఉండి కూడా బాబుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు జరిపించటం లేదని ప్రశ్నించారు. ఇటీవల రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు కూడా ఐఎంజీ భూ కేటాయింపు లో తప్పులు జరిగాయని అసెంబ్లీలోనే చెప్పారని శోభ గుర్తుచేశారు. మరో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాంకీ సంస్థకు చంద్రబాబే కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుని భూకేటాయింపులు జరిపారని అసెంబ్లీలో పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వీటన్నింటినీ ప్రభుత్వం ఎందుకు సీబీఐకి తెలియజేయటం లేదని ప్రశ్నించారు.
జగన్ ఏ విధంగా తప్పు చేసినట్లు?: జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు చట్టబద్ధంగా ఏ చిన్న తప్పు చేయనప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాని వ్యక్తి, సచివాలయం వైపు కన్నెత్తి చూడని జగన్మోహన్రెడ్డి ఏ విధంగా తప్పు చేసినట్లవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ధర్మాన కృష్ణదాస్, ప్రసన్నకుమార్రెడ్డి, గొల్ల బాబూరావు, కోరుముట్ల శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డిలతో కలిసి భూమన కరుణాకరరెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘వివాదాస్పదమైన 26 జీవోల విషయం లో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు.. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏ చిన్న తప్పు చేయలేదని శాసనసభా సాక్షిగా సీఎం కిరణ్ స్పష్టం చేశారు. అభియోగాలు కోర్టులో రుజువయ్యేంత వరకు నేరస్తులు కాదని అసెంబ్లీలో ప్రకటిం చారు. తనకు సంబంధించిన మంత్రుల విషయంలో ఒక విధంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్.. అదే జగన్ విషయంలో మాత్రం నేరస్తుడు, కుట్రదారుడు అంటూ తప్పుడు కేసులు బనాయించి సీబీఐని ఉసిగొల్పి సంవత్సరకాలంగా జైల్లో నిర్బంధించారు. సచివాలయం ముఖం చూడకుండా ఏ ఒక్క ఫైలుపై సంతకం చేయని జగన్ గురించి ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్ కడిగిన ఆణిముత్యం అని ప్రజలకందరికీ తేటతెల్లమయ్యిందన్నారు. చంద్రబాబు మీద ఏలేరు, ఐఎంజీ, ఎమ్మార్ వంటి ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని, మద్యం ముడుపుల కేసులో కోర్టుకు వెళ్లి ‘స్టే’ తెచ్చుకున్న వ్యక్తి ఆయన అని ఎండగట్టారు.
ఆ జీవోలన్నీ సక్రమమని అసెంబ్లీలో చెప్పినట్లే హైకోర్టుకు చెప్పలేదేం?
జగన్మోహన్రెడ్డి నిరపరాధిగా నిర్ధారణవుతుందని భయపడ్డారా?
సంతకాలు చేసిన మంత్రులు కాకుండాఅధికారంలో భాగం కాని జగన్ దోషి ఎలా అవుతారు?
కిరణ్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు కోరారు.. మరి ఇప్పుడు మౌనం ఎందుకు?
వైఎస్సార్ సీఎల్పీ ప్రశ్నలు...
మంత్రులు జీవోలు జారీ చేయటంలో ఎలాంటి తప్పు చేయలేదని, క్విడ్ ప్రో కో లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు. క్విడ్ ప్రో కో లేకుంటే జగన్పైన కేసు ఎందుకు?
జీవోల జారీ అంతా నిబంధనలకు అనుగుణంగానే జరిగితే మరి క్విడ్ ప్రో కో ఎక్కడుంది?
నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేసిన మంత్రులు తప్పు చేయకుండా.. అధికారంలో ఒక్క రోజు కూడా భాగం కాని, ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కాని జగన్ ఎలా దోషి అవుతారు?
మంత్రులది తప్పు కాకుంటే హైకోర్టు నిర్దిష్టంగా అడిగినా అప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు?
జగన్ను ఉచ్చులో బిగించాలని ప్రభుత్వం అప్పుడు మౌనం దాల్చిందా? ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మంత్రులను సమర్థిస్తూ సీఎం చెప్తున్న మాటలు అప్పుడు కోర్టుకు ఎందుకు చెప్పలేదు?
ఇవే మాటలు అప్పుడు కోర్టుకు చెప్పి ఉంటే జగన్ నిరపరాధి అని నిర్ధారణ అవుతుందని భయపడ్డారా?
రాజీనామాలు చేసినంత మాత్రాన పొరపాట్లు చేసినట్లు కాదంటున్నారు. అభియోగాలున్నంత మాత్రాన జగన్ను ఎలా తప్పుపడతారు? అప్పుడు టీడీపీ పైన మౌనం ఎందుకు? ఇప్పుడు అదే పార్టీపైన కాలుదువ్వటం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: సీబీఐ కేసుతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఉచ్చు బిగించాలన్న ఉద్దేశంతోనే.. ఆ కేసులోని జీవోల వ్యవహారంపై హైకోర్టు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని అసెంబ్లీ వేదికగా సీఎం కిరణ్కుమార్రెడ్డి, మంత్రులు చెప్తున్న మాటలతో తేటతెల్లమయింద ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఎండగట్టింది. ‘‘ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏ తప్పులూ జరగలేదని సీఎం, మంత్రులు అసెంబ్లీలో చెప్పిన మాటలను ఆనాడు హైకోర్టుకు చెబితే జగన్మోహన్రెడ్డి నిరపరాధిగా నిర్ధారణ అవుతుందని భయపడ్డారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు శోభానాగిరెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ్రెడ్డి, కె.శ్రీనివాసులతో కలిసి ఆమె మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై ఉచ్చు బిగించవచ్చని, మంత్రుల మెడకు చుట్టుకునే దాకా ఈ కేసు రాదనే భావనతోనే ప్రభుత్వం ఆనాడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని శోభ ఉద్ఘాటించారు. ‘‘ఇప్పుడు మంత్రుల మెడకూ చుట్టుకోవటంతో ఆ జీవోలన్నీ నిబంధనలు ప్రకారం జారీ అయ్యాయన్న విషయాన్ని బలంగా చెప్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో వాళ్ల మాటలతోనేజగన్మోహన్రెడ్డి నిర్దోషి అని తేలిపోతోంది’’ అని పేర్కొన్నారు. ‘‘మంత్రులు జీవోలు జారీ చేయటంలో క్విడ్ ప్రో కో లేదని సీఎం చెప్తున్నారు. క్విడ్ ప్రో కో లేకుంటే జగన్పైన కేసు ఎందుకు? నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేసిన మంత్రులు తప్పు చేయకుండా.. అధికారంలో ఒక్క రోజు కూడా భాగం కాని, ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కా ని జగన్ ఎలా దోషి అవుతారు?’’ అని శోభానాగిరెడ్డి ప్రశ్నిం చారు. మంత్రులు రాజీనామాలు చేసినంత మాత్రాన పొరపాట్లు చేసినట్లు కాదంటున్న వారు.. అభియోగాలున్నంత మాత్రాన ఆయన్ను ఎలా తప్పుపడతారని ఆమె నిలదీశారు.
అసెంబ్లీ వేదికగా టీడీపీ రాజకీయ డ్రామాలు: అధికార కాంగ్రెస్ పార్టీతో అన్ని విధాల కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. దొంగే దొంగ అని అరిచినట్టు తమను కాంగ్రెస్తో కుమ్మక్కయ్యామని ఆరోపణలు చేస్తోంద ని శోభానాగిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ వేదికగా వారు కొత్త డ్రామా మొదలు పెట్టారని దుయ్యబట్టారు. వాళ్ల కుమ్మక్కు రాజకీయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దొంగలబండికి నాయకుడని విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. మొన్నటి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడారని ఆమె నిలదీశారు. ‘‘అప్పుడు అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇప్పుడు వారు కళంకిత మంత్రులంటున్న వారితో సహా ప్రభుత్వమే ఉండేది కాదుకదా?’’ అని ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్షాలు అవిశ్వాసానికి మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని కాపాడింది టీడీపీ ఒక్కటేనని గుర్తుచేశారు. ‘‘తోక పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని.. తర్వాత తామే అవిశ్వాస తీర్మానం పెడతామని పాదయాత్రలో చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టటానికి ఎందుకు ముందుకు రావటం లేదు?’’ అని ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరోవైపు ప్రజలను మభ్యపెట్టేందుకు మంత్రులపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ తీరును దుయ్యబట్టారు. తామే కనుక కాంగ్రెస్తో కుమ్మక్కు అయితే ఏడాదిగా జగన్మోహన్రెడ్డి జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ‘‘జగన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో కేసు వేస్తేనే, అదే కేసులో టీడీపీ నేతలు ఇంప్లీడ్ అయిన విషయం వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు.
బాబుపై మీ ఆరోపణలను సీబీఐకి ఎందుకివ్వరు?
ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ సహకరిస్తున్న కారణంగానే ఐఎంజీ భూ కేటాయింపుల వ్యవహారంలో చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు జరగటం లేదని శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. కిరణ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఐఎంజీ భూముల వ్యవహారంలో బాబుపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడాయనే సీఎంగా ఉండి కూడా బాబుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు జరిపించటం లేదని ప్రశ్నించారు. ఇటీవల రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు కూడా ఐఎంజీ భూ కేటాయింపు లో తప్పులు జరిగాయని అసెంబ్లీలోనే చెప్పారని శోభ గుర్తుచేశారు. మరో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాంకీ సంస్థకు చంద్రబాబే కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుని భూకేటాయింపులు జరిపారని అసెంబ్లీలో పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వీటన్నింటినీ ప్రభుత్వం ఎందుకు సీబీఐకి తెలియజేయటం లేదని ప్రశ్నించారు.
జగన్ ఏ విధంగా తప్పు చేసినట్లు?: జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు చట్టబద్ధంగా ఏ చిన్న తప్పు చేయనప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాని వ్యక్తి, సచివాలయం వైపు కన్నెత్తి చూడని జగన్మోహన్రెడ్డి ఏ విధంగా తప్పు చేసినట్లవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ధర్మాన కృష్ణదాస్, ప్రసన్నకుమార్రెడ్డి, గొల్ల బాబూరావు, కోరుముట్ల శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డిలతో కలిసి భూమన కరుణాకరరెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘వివాదాస్పదమైన 26 జీవోల విషయం లో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు.. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏ చిన్న తప్పు చేయలేదని శాసనసభా సాక్షిగా సీఎం కిరణ్ స్పష్టం చేశారు. అభియోగాలు కోర్టులో రుజువయ్యేంత వరకు నేరస్తులు కాదని అసెంబ్లీలో ప్రకటిం చారు. తనకు సంబంధించిన మంత్రుల విషయంలో ఒక విధంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్.. అదే జగన్ విషయంలో మాత్రం నేరస్తుడు, కుట్రదారుడు అంటూ తప్పుడు కేసులు బనాయించి సీబీఐని ఉసిగొల్పి సంవత్సరకాలంగా జైల్లో నిర్బంధించారు. సచివాలయం ముఖం చూడకుండా ఏ ఒక్క ఫైలుపై సంతకం చేయని జగన్ గురించి ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్ కడిగిన ఆణిముత్యం అని ప్రజలకందరికీ తేటతెల్లమయ్యిందన్నారు. చంద్రబాబు మీద ఏలేరు, ఐఎంజీ, ఎమ్మార్ వంటి ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని, మద్యం ముడుపుల కేసులో కోర్టుకు వెళ్లి ‘స్టే’ తెచ్చుకున్న వ్యక్తి ఆయన అని ఎండగట్టారు.
0 comments:
Post a Comment