Home »
» రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని...
రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని...
నిజాన్ని తేల్చాల్సిన దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించి వై.ఎస్.జగన్ని విజయవంతంగా జైలుకు పంపేశారు. పచ్చపాలకుల, పచ్చపత్రికల పైశాచికత్వాన్ని తన గుండె ధైర్యంతో ఒంటరిగా ఎదుర్కొని రెండుసార్లు రాజ్యాధికారాన్ని సాధించిన రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని నల్లారివారి నల్ల నాయకత్వంలో ఇచ్చుకున్నారు. కర్నూలు ఓదార్పులో జగన్ ‘‘వీళ్లు నా కాళ్లు విరగ్గొట్టొచ్చు లేదా నా వెన్నెముక విరగ్గొట్టొచ్చు. వీళ్లు ఏమి చేసినా నేను కెరటంలా ఎగిరిపడతాను’’ అని చెప్పారు. ఎప్పుడూ మాట మీద నిలబడే రాజన్న, ఒకసారి ‘ప్రతిరంగంలో మనకు రిటైర్మెంట్ ఉండాలి, అలాగే రాజకీయాల్లో కూడా ఉండాలి. నేను కచ్చితంగా అరవై సంవత్సరాలకు రిటైర్ అవుతాను’ అని చెప్పారు. కాకపోతే ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు చాలా మిగిలిపోవడం వల్ల, మరీ ముఖ్యంగా ఆయన అనుకున్న జలయజ్ఞం ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం వల్ల మరికొంతకాలం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాని మాట తప్పని రాజన్నకి ఆ మచ్చ ఉండకూడదని దేవుడికి అనిపించిందేమో! ‘రాజన్నా! నువ్వు మాట తప్పొద్దు. నీకన్నా నీ కుమారుణ్ని గొప్ప నాయకుడిగా తయారుచేసే బాధ్యత నాది’ అని చెప్పి తీసుకెళ్లిపోయాడనిపిస్తుంది. అందుకే ఇంతమంది రాజకీయ నాయకులు, వాళ్ల అనుబంధ మీడియా సంస్థలు ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తే, జగన్ అంతగా రాటుదేలి గొప్పనాయకుడిగా తయారవుతాడు. అంతవరకు రాజన్నని ప్రేమించే ప్రతి గుండె ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే అవకాశం వచ్చిన ప్రతిసారీ గుణపాఠం చెప్పాలి. - శ్రీకాంతరెడ్డి జంబుల, సంగలపల్లి, వైఎస్సార్ కడప జిల్లా
|
|
0 comments:
Post a Comment