రేపు జరిగే వైఎస్ఆర్ సీపీ సదస్సుకు ఏర్పాట్లు పూర్తైయ్యాయని భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. 6 జిల్లాల నుంచి 6 వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. సహకార ఎన్నికల్లోనే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని, స్థానిక ఎన్నికల్లో కూడా కుట్రలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు చాలా చోట్ల కలిసి పనిచేసే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు
తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో రేపు వైఎస్ఆర్సీపీ సదస్సు జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సదస్సును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించనున్నారు. సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సదస్సులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుపనున్నట్టు రాయలసీమ కోఆర్డినేటర్ భూమానాగిరెడ్డి తెలిపారు.
తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో రేపు వైఎస్ఆర్సీపీ సదస్సు జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సదస్సును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించనున్నారు. సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సదస్సులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుపనున్నట్టు రాయలసీమ కోఆర్డినేటర్ భూమానాగిరెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment