వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఐలూరి వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. మధిర, ఖమ్మం, భద్రాచలం, వైరా లకు చెందిన పలువురు కాంగ్రెస్, సీపీఐ నేతలు కూడా వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో వైఎస్ఆర్ సీపీ కేంద్రకమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రు సమక్షంలో టీడీపీ నుంచి 100 మంది వైఎస్ఆర్ సీపీలో చేరారు. |
చిత్తూరు/సికింద్రాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. చిత్తూరు వెదురుకుప్పం మండలం నూకమాంబపురం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరాయి. జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఈ కుటుంబాలు పార్టీలోకి వచ్చాయి.
సికింద్రాబాద్ బన్సాల్పేటలో వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో 150 మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. |
0 comments:
Post a Comment