గల్ఫ్ బాధితులను ఆదుకోండి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గల్ఫ్ బాధితులను ఆదుకోండి: విజయమ్మ

గల్ఫ్ బాధితులను ఆదుకోండి: విజయమ్మ

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

గల్ఫ్ లో నూతనంగా అమల్లోకి వచ్చిన నితాఖత్ చట్టం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన తెలుగు వారిని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ శుక్రవారం సీఎంకు లేఖ రాశారు. నితాఖత్ చట్టం వల్ల సౌదీలో ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. కువైట్ లోనే లక్షా యాభై వేల మంది మన కార్మికులకు నష్టం వాటిల్లందన్నారు. వీరిని తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా సీఎంకు రాసిన లేఖలో వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. 

ఇదే విషయంపై గతనెల17న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన సంగతిని సీఎం కిరణ్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. తెలుగువారికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అరబ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితుల కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గల్ఫలో ఉద్యోగాలు కోల్పోయినవారికి ఇక్కడ ఉపాధి కల్పించాలని సీఎంకు రాసిన లేఖలో వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. 
Share this article :

0 comments: